తెలంగాణ బిజెపి అధ్యక్షుడిగా ఎంపి బండి సంజయ్

తెలంగాణ రాష్ట్ర బిజెపి కమిటీ అధ్యక్షుడిగా కరీంనగర్ లోక్ సభ సభ్యుడు బండి బండి సంజయ్ కుమార్ నియమితులయ్యారు. ఈ రోజు ఆయన నియమాకాన్ని పార్టీ అధ్యక్షుడు  జగత్ ప్రకాశ్ నద్దా ఆమోదించారు. ఈ మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ఒక ప్రకటన విడుదల చేశారు.
సంజయ్ 2019 లోక్ సభ ఎన్నికల్లో కరీంనగర్ నుంచి పోటీచేసి గెలుపొందారు. ఆయన ఆర్ ఎస్ ఎస్ నుంచి వచ్చారు. విద్యార్థి దశలో ఎబివిపిలో కూడా పని చేశారు.
  బండి సంజయ్  వ్యక్తిగత విశేషాలు :
చాలా సాదా సీదా కుటుంబ నేపథ్యం నుంచి సంజయ్ వచ్చారు. చిన్నప్పటి నుంచి ఆయన ఆర్ ఎస్ ఎస్ భావజాలం నుంచే ప్రభావితులవుతూ వచ్చారు.
పేరు: బండి సంజయ్ కుమార్
పుట్టిన తేదీ:11-7-1971
తల్లిదండ్రులు: (కీ.శే. బండి నర్సయ్య) – శకుంతల.
మతము: హిందువు
కులము: మున్నూరుకాపు,(బి.సి-‘డి’)
భార్య: బండి అపర్ణ(మాజీ ఎస్.బి.ఐ ఉద్యోగిని)
పిల్లలు: సాయి భగీరత్, సాయి సుముఖ్
ప్రస్తుత బాధ్యత: కరీంనగర్ నగరపాలక సంస్థ 48వ డివిజన్ కార్పొరేటర్,బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి.
గతంలో చేపట్టిన బాధ్యతలు:
–బాల్యం నుంచే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ లో స్వయం సేవకుడిగా..
–అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్ లో పట్టణ కన్వీనర్,పట్టణ ఉపాధ్యక్షునిగా,రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా..
–ది కరీంనగర్ కో-ఓపరేటివ్ అర్బన్ బ్యాంక్ లో రెండు పర్యాయాలు (1994-1999;1999-2003) డైరెక్టర్ గా..
–బిజెపి జాతీయ కార్యాలయం,ఢిల్లీ లో ఎన్నికల ప్రచార ఇంచార్జ్ గా
–భారతీయ జనతా యువమోర్చా పట్టణ ప్రధాన కార్యదర్శి,పట్టణ అధ్యక్షునిగా,స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబెర్ గా,రాష్ట్ర ఉపాధ్యక్షునిగా,నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబెర్ గా,జాతీయ కార్యదర్శిగా సేవలందిస్తూ కేరళ,తమిళనాడు ఇంచార్జి గా బాధ్యతలు చేపట్టారు.
–ఎల్.కె అద్వానీ  చేపట్టిన సురాజ్ రథ యాత్రలో వెహికల్ ఇంచార్జి గా..
–కరీంనగర్ నగర పాలక సంస్థ గా ఏర్పడిన తర్వాత మొట్టమొదటిగా 48వ డివిజన్ నుండి బిజెపి కార్పొరేటర్ గా,రెండవసారి అదే 48వ డివిజన్ నుండి భారీ మెజారిటీ తో హ్యాట్రిక్ విజయం సాధించారు.
— వరుసగా రెండు పర్యాయాలు నగర బిజెపి అధ్యక్షునిగా.
–2014 సాధారణ ఎన్నికల్లో కరీంనగర్ శాసనసభ బిజెపి అభ్యర్థిగా పోటీ చేసి,52,000 వేల పై చిలుకు ఓట్లు సాధించి రెండవ స్థానంలో నిల్చున్నాడు.
–2019 ఎన్నికల్లో తిరిగి బిజెపి తరుపున కరీంనగర్ శాసనసభ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేసి 66009 ఓట్లను సంపాదించి రెండవ స్థానంలో ఉండగా,రాష్ట్రంలో పోటీ చేసిన బిజెపి అభ్యర్థుల్లో ప్రథమ స్థానం లో నిల్చున్నారు.
-2019 పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ బిజెపి అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు.