షాకింగ్ న్యూస్: మోహన్ బాబు ఇంట్లో ఖరీదైన నగలు చోరీ

సీనియర్ నటుడు మోహన్ బాబు ఇంట్లో చోరీ జరిగింది. లక్షల విలువైన నగలు అపహరణకు గురైనట్లు సమాచారం. ఎప్పుడూ సెక్యూరిటీ ఉండే ఇంట్లో దొంగతనం జరగడంతో మోహన్ బాబు కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు. ఘటనపై బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసారు మోహన్ బాబు మేనేజర్.

ఎవరిపైన అయినా అనుమానం ఉందా అని పోలీసులు ప్రశ్నించగా పని మనిషి ఇలా చేసి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. అపరిచితులు లోనికి వచ్చి దొంగతనానికి పాల్పడే అవకాశం లేదని వారు భావిస్తున్నారు. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి పనిమనిషే ఈ దొంగతనానికి ఒడిగట్టి ఉండొచ్చని వారి అనుమానంగా తెలుస్తోంది.

ఇటీవలే సినీనటి భానుప్రియ ఇంట్లో పని మనిషి వ్యవహారం కలకలం రేపింది. ఆ ఇంట్లో పని చేస్తున్న సంధ్య అనే అమ్మాయి విలువైన వస్తువులు దొంగతనం చేసిందని నిలదీస్తే తిరిగి తమపైనే సంధ్య తల్లి తప్పుడు కేసు పెట్టిందని భానుప్రియ వాపోయారు. ఈ ఘటన సినీ వర్గాల్లో సంచలనం సృష్టించింది. ఇప్పుడు నటుడు మోహన్ బాబు ఇంట్లో కూడా పనిమనిషే చోరీకి పాల్పడిందని ఆరోపణలు వ్యక్తం అవడం గమనార్హం. సెలెబ్రిటీల ఇళ్లలో పనిమనుషులు ఇలాంటి పనులకు పాల్పడటం మిగిలినవారిని అప్రమత్తం చేస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *