సిఎం జగన్ బొమ్మ మీద మళ్లీ నల్ల రంగు…

విజయవాడ సమీపంలోని  గన్నవరంలో  సిఎం జగన్మోహనరెడ్డి ఫ్లెక్సీ పై  గుర్తు తెలియని వ్యక్తులు నల్లరంగు పూశారు. దీనితో కృష్ణ జిల్లా గన్నవరం మండలం కేసరపల్లి పంచాయితీ కార్యాలయం వద్ద వైసీపీ నాయుకుల ఆందోళనకు దిగారు. జగన్మోహన్ రెడ్డి మొహానికి రంగు వేసి, పథకాల బ్యానర్ పై గీతలు గీసారంటూ, వారి ని అరెస్టు చేసి శిక్షించాలని వారు ఆందోళనకు దిగారు. పంచాయతీ కార్యదర్శి ముఖ్యమంత్రి బొమ్మ మీద నల్ల రంగపూయడం మీద స్థానిక పోలీస్ స్టేషన్లో  పిర్యాదు చేశారు.ఏస్.ఐ వాసిరెడ్డి శ్రీను సంఘటన స్థలాన్ని పరిశీలించారు. గతంలో కూడా ఇలానే గుర్తుతెలియని వ్యక్తులు పంచాయితీ కార్యాలయంపై ఉన్న జగన్మోహన్ రెడ్డి బ్యానర్ పై బురద జల్లారని  స్థానికులుచెప్పారు. ఈ ప్రాంతంలో కొంతమందిరైతులు అమరావతి నుంచి రాజధాని తరలింపును వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే.