టీడీపీ ఎమ్మెల్యే అనితకు ఘోర అవమానం

విశాఖ పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనితకు టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు షాక్ ఇచ్చారు. ఆదివారం పాయకరావుపేటలో జరిగిన చంద్రబాబు రోడ్ షోలో అనితకు ఘోర అవమానం జరిగింది. పాయకరావుపేట టికెట్ విషయంలో పార్టీ రెండు గ్రూపులుగా విడిపోయింది. అనిత సమ్మతి వర్గం, అసమ్మతి నేతల వర్గం చంద్రబాబు వద్ద బల ప్రదర్శన కూడా చేశారు. ఐతే టికెట్ కొత్తవారికి ఇస్తే వర్గపోరు తగ్గుతుంది అని భావించిన చంద్రబాబు ఈ సెగ్మెంట్లో కెజిహెచ్ డాక్టర్ బుడుమూరి బంగారయ్యకు కేటాయించారు.

అప్పటి నుండి అనిత వర్గీయులు అసంతృప్తితో రగిలిపోతున్నారు. చంద్రబాబు నిర్ణయం వర్కౌట్ కాలేదు కదా ఇటు బంగారయ్య కూడా అసమ్మతి నేతలతో కుమ్మక్కయ్యాడని ప్రచారం సాగుతోంది. దీంతో అనితకు టికెట్ ఇవ్వడంపై వ్యతిరేకించిన నేతలకు, అనిత వర్గీయులకు మధ్య పొసగట్లేదు. పాయకరావుపేట టీడీపీలో అంతర్గత వర్గపోరు పెరిగింది. వీటికి ఆజ్యం పోస్తూ ఆదివారం జరిగిన రోడ్ షో లో అనిత వ్యతిరేకులనే అందలమెక్కించారు చంద్రబాబు. రోడ్ షో ఆమెను వ్యతిరేకించినవారిదే పైచేయిగా సాగింది. అనిత వర్గీయులకు అక్కడ ప్రాధాన్యం దక్కలేదు.

ఇక చంద్రబాబు కూడా తన ప్రసంగంలో ఎక్కడా సమ్మతి నేతల టాపిక్ తీయకపోవడంతో అనిత వర్గం కలత చెందింది. ఆయనొస్తాడు, అందరిని కలుపుకుపొమ్మని బంగారయ్యకు చెబుతాడు అనుకుంటే… వారి ఆశ నిరాశగా మిగిలింది. రోడ్ షో ఆద్యంతం అసమ్మతి నేతల హవానే నడిచింది. దీంతో అనిత వర్గం అవమానంగా ఫీల్ అవుతోందని సమాచారం. ఈ వర్గ పోరు వలన ఎన్నికల్లో తనకి నష్టం వాటిల్లుతుందేమో అని పాయకరావుపేట అభ్యర్థి బంగారయ్య మదన పడుతున్నట్లు తెలుస్తోంది.

ఇది కూడా చదవండి

https://trendingtelugunews.com/jeevitha-rajasekhar-join-ysrcp/

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *