భారత్ లో రికార్డు స్థాయిలో పెరుగుతున్న కరోనా కేసులు

ఒకవైపు దేశమంతా లాక్ డౌన్ నియమాలను సడలిస్తూపోతుంటే మరొక వైపు కరోనా వైరస్ పాజిటివే కేసుల సంఖ్య కూడా బాగా పెరుగుతూ ఉంది.
గడచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో అత్యధికంగా 6,767 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దేశంలో కరోన బాధితుల సంఖ్య 1,31, 868 చేరినట్లు ప్రకటించిన కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇలా గత మూడు రోజులుగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతూ ఉంది. పోతే, గడచిన 24 గంటలలో 147మంది మృతి చెందారు. దేశంలో మొత్తం మృతుల సంఖ్య 3,867 కు చేరింది. ఇంతవరకు మొత్తంగా 54,440 మందికి చికిత్స తీసుకుని కరోనా నుంచి బయటపడితే, 73, 560 మందికి ఇంకా ఆసుపత్రులలో చికిత్స తీసుకుంటున్నారు.
నిన్న ఒక్కరోజే 2, 657మంది బాధితులు కోలుకున్నారు. భారతదేశంలో కోలుకుంటున్నవారి రేటు 41.28 శాతానికి పెరిగిందని ప్రభుత్వం ప్రకటించింది.