ఇండియా అప్ డేట్: పెరుగుతున్న కరోనా కేసుల మధ్య ఇదొక ఆశాకిరణం..

భారత దేశంలో కరోనా కేసుల పెరుగుదల ఏరోజుకారోజు ఒక రికార్డవుతూ ఉంది. గత  24 గంటల్లో దేశంలో అత్యధికంగా 17,296 కరోనా పాజిటివ్  కేసులునమోదయ్యాయి. వీటితో మొత్తొ కేసుల సంఖ్య 4,90,401 అయింది. అయితే, కేసులతోపాటు కోలుకుంటున్న వారి సంఖ్య కూడా మెరుగుపడుతూ ఉండటం కొంత వూరటకలిగించే విషయం. ఇంతవరకు 58.24 శాతంమంది కోలుకున్నారు.జూన్ 25 నాటికి దేశంలో 77, 76,228 కరోనా పరీక్షలు నిర్వహించారు. గురువారం నాడు 2, 15, 446 శాంపిల్స్ ను పరీక్షించారు.
నిన్న దేశంలో 407 మంది మృతి చెందడంతో మొత్తం మృతుల సంఖ్య  15,301 కు చేరిందని కేంద్ర ఆరోగ్య శాఖ బులెటీన్ విడుదలచేసింది. మరణాలలో 70 శాతం మంది ఇతర షుగర్, బిసి వంటి జబ్బులతో బాధపడుతున్నవారే నని కేంద్రం ప్రకటించింది.
క్లుప్తంగా: బెంగుళూరులో లాక్ డౌన్ ఉండదు: సిఎం యడ్యూరప్ప; కరోనా సోకితే స్త్రీల కంటే పురుషుల్లోనే తీవ్రంగా ఉంటోంది (చైనా పరిశోధన);
ఇవీ ఇండియా వివరాలు:
దేశ వ్యాప్తంగా 1,89,463 యాక్టీవ్ కేసులు, 2,85,637 మంది డిశ్చార్జ్
దేశంలో 58 శాతానికి చేరిన కరోనా రికవరీ రేటు
మహారాష్ట్రలో అత్యధికంగా 1,47,741 కేసులు,6931 మంది మృతి
ఢిల్లీలో 73,780 కేసులు,2429 మంది మృతి
తమిళనాడులో 70,977 కేసులు,911 మంది మృతి
గుజరాత్ లో 29,520 కేసులు,1753 మంది మృతి
ఉత్తరప్రదేశ్ లో 20,193 కేసులు,611 మంది మృతి
రాజస్థాన్ లో 16,296 కేసులు,379 మంది మృతి
పశ్చిమ బెంగాల్ లో 15,648 కేసులు,606 మంది మృతి
మధ్యప్రదేశ్ లో 12,596 కేసులు,542 మంది మృతి
హర్యానాలో 12,463 కేసులు,198 మంది మృతి
తెలంగాణలో 11,364 కేసులు,230 మంది మృతి
ఏపీలో 10,884 కేసులు,136 మంది మృతి
కర్ణాటకలో 10,560 కేసులు,170 మంది మృతి