తెలంగాణలో యాక్టివ్ కేసులు బాగా తగ్గుతున్నాయ్

తెలంగాణ రాష్ట్రంలో యాక్టివ్ కరోనా కేసుల సంఖ్య బాగా తగ్గిపోతూ ఉంది. ఇందొక మంచి పరిణామం. అంటే తెలంగాణలో  కోవిడ్-19 రోగులు చికిత్స తీసుకుని జబ్బు నయం చేసుకుని హ్యపీగా ఇంటికెళ్లి పోతున్నారని అర్థం. ఈ రోజు  తెలంగాణా ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటీన్ ప్రకారం రాష్ట్రంలోని కోవిడ్ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నవారి సంఖ్య కేవలం394 మంది మాత్రమే.
నిజానికి పాజిటివ్ కేసులు పెరుగుతున్నా, ఆసుపత్రుల నుంచి విడుదలవతున్న వారి సంఖ్య  బాగా పెరుగడంతో యాక్టివ్ కేసుల సంఖ్య తగ్గిపోతూ ఉంది.
ఈ  రోజు రాష్ట్రంలో 41 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనితో ఇప్పటి వరకు రాష్ట్రం లో నమోదయిన పాజిటివ్ కేసులు 1367.  ఇప్పటివరకు ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య  939. ఈ రోజు డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 117 మంది. అయితే, కొత్త కనిపించిన పాజిటివ్ కేసుల కంటే మూడింతలు ఎక్కువగా జబ్బు నయం చేసుకుని డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 34  మంది చనిపోయారు. ఈ రోజు చనిపోయిన వారు ఇద్దరు.
 ఈ రోజు నమోదయిన కొత్త కేసులలో ఒక్కజిహెచ్ ఎంసినుంచే 31 ఉన్నారు. మిగతా పది మంది ఇతర రాష్ట్రాలనుంచి వచ్చినవారిన ఆరోగ్య శాఖ చెప్పింది.
రాష్ట్రంలో వరంగల్ రూరల్, వనపర్తి, యాదగిరి జిల్లాలో కరోనా కేసులు మొదటి నుంచి నిల్. మరొక  25 జిల్లాలలో గత 14రోజుల నుంచి కరోనా కేసులే లేవు. ఈ జిల్లాలు ఇవే :
  1. KARIMNAGAR
    2 SIRICILLA
    3 KAMAREDDY
    4 MAHABUBNAGAR
    5 MEDAK
    6 BHUPALPALLY
    7 SANGA REDDY
    8 NAGARKURNOOL
    9 MULUGU
    10 PEDDAPALLY
    11 SIDDIPET
    12 MAHABUBABAD
    13 MANCHERIAL
    14 BADRADRI
    15 VIKARABAD
    16 NALGONDA
    17 ASIFABAD
    18 KHAMMAM
    19 NIZAMABAD
    20 ADILABAD
    21 SURYAPET
    22 NARAYANPET
    23 WARANGAL URBAN
    24 JANAGAON
    25 GADWAL
    26 NIRMAL