ఎపిలో 2432 కొత్త కరోనాకేసులు, 44 మరణాలు, గుంటూరు జిల్లా టాప్ 468 కేసులు

ఆంధ్రప్రదేశ్ గడిచిన 24 గంటల్లో కొత్తగా 2432 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి,కోవిడ్-19 వల్ల  44 మరణించారు. రాష్ట్రానికి సంబంధించిన కరోనా పాజిటివ్  2412 కేసులుకాగా, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిలో  20 మందికి కరోనా నిర్ధరణ అయింది. రాష్ట్రంలో మొత్తంగా కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 35451కి చేరిందని ఆరోగ్య శాఖ బులెటీన్ వెల్లడించింది.
గడిచిన 24 గంటల్లో మొత్తం 22197 శాంపిల్స్‌ పరీక్షించారు.ఇప్పటివరకు కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 452.
జిల్లాలకు సంబంధించి గుంటూరు జిల్లా నుంచి  468 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి.రెండోస్థానంలో ఉన్న కర్నూలు జిల్లా  నుంచి 433 కేసులు నమోదయ్యాయి. చిత్తూరు జిల్లా 257కేసులతో మూడో స్థానంలో ఉంది. తూర్పుగోదావరిలో జిల్లాలనుంయచి 247 కేసులు నమోదయ్యాయియ. శ్రీకాకుళం నుంచి 175, అనంతపురం జిల్లా నుంచి 162 కేసులు నమోదయ్యాయి. జిల్లాల కరోనా వివరాలివే.