టీడీపీ ఎమ్మెల్యేలు ఆమంచి, పోతులకు ఘోర అవమానం (వీడియో)

ప్రకాశం జిల్లాలో టీడీపీ ఎమ్మెల్యేలకు ఘోర అవమానం జరిగింది. చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్, కందుకూరు ఎమ్మెల్యే పోతుల రామారావులపై జనం రాళ్లతో దాడి చేసారు. రాజకీయ వర్గాల్లోనూ, జిల్లా వ్యాప్తంగాను ఈ ఘటన తీవ్ర దుమారం రేపుతోంది.

ఆమంచి, పోతుల కాన్వాయ్ వెళుతుండగా కొందరు వ్యక్తులు రాళ్లు విసురుతూ తిరగబడ్డారు. రాళ్ల దాడికి వారు వాహనాలను వెనక్కి తిప్పుకుని వెళ్ళవలసి వచ్చింది. కాగా స్థానిక పోలీసులు ఆందోళనకారులను అడ్డుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. స్థానికంగా ఈ ఘటన హాట్ టాపిక్ గా మారింది. జిల్లాలోని అధికార, ప్రతిపక్ష వర్గాలు ఈ ఘటనతో ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు.

టీడీపీ ఎమ్మెల్యేల తీరు నచ్చకే ప్రజలు వారిపై తిరుగుబాటు మొదలు పెట్టారు అని వైసీపీ శ్రేణులు విమర్శనాస్త్రాలు విసురుతున్నారు. కాగా టీడీపీ నాయకులు ఇది వైసీపీ నేతల కుట్రేనంటూ ఆరోపణలు చేస్తున్నారు. రోజు రోజుకి ప్రజల్లో టీడీపీ అంటే పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేకనే ప్రతిపక్ష నేతలు ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్, కందుకూరు ఎమ్మెల్యే పోతుల రామారావు కాన్వాయ్ పై రాళ్లతో దాడి చేస్తున్న దృశ్యాలు కింద ఉన్న వీడియోలో చూడవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *