పులి … పులి… వచ్చేసింది రోయ్… సభలోకి

అనంతపురం రాజకీయాల్లో  హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ ఒక  కొత్త సంచలనం.  ఆయన రాజకీయ  ప్రవేశం, అంతకు ముందు పోలీసు ఇన్సెపెక్టర్ గా ఉన్నపుడు జిల్లా బలాఢ్యుడయిన జెసి దివాకర్ రెడ్డి కి విసిరిన సవాల్ , ఎన్నికల్లో  గెలుపు అన్ని సంచలనమే.
అందుకే  ఆయనను జిల్లాలో  ‘పులి’  లా చూస్తారు. పులి అని పిలుస్తారు. అలా ఎక్కడా చూసిన పులి అనడం  హిందూపురం నియోజకవర్గంలో నే కాదు, అనంతపురం నియోజకవర్గంలో కూడా వినబడుతూ ఉంటుంది.
జిల్లా రాజకీయాలలో సంప్రదాయిక మోతుబరి నాయకుడిగా కాకుండా అసలైన జననేతగా ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు.
ఇంతవరకు జిల్లా మీద పెద్ద పెద్ద వ్యాపారస్థులు, భూస్వాములు పెత్తనం చలాయించారు. మాధవ్ వంటి వాళ్ల రాకతో ఆ  రాజకీయాలు మాయమవుతున్నాయను కోెవాలి. ఇదొక వాంఛనీయ పరిణామం.
ఎంపిగా గెలిచినా మాధవ్ ఇప్పటిదాకా ఈ ఎంపి కల్చర్ ను దూరంగా ఉంచారు. తన దగ్గరికి రానీయలేదు.
ప్రజలకు తనకు గన్ మన్ అడ్డమని భావించారాయన.  అనంతపురం రామ్ నగర్ లో ఉన్న ఆయన నివాసానికి ఎవరైనా రావచ్చు పోవచ్చు. ఎపుడూ అందుబాటులో ఉంటాడని పేరు. జిల్లాకు ఇలాంటి నాయకుడు లేక చాలా కాలమయింది.
జిల్లాలో ఆయన ప్రత్యామ్నాయ నాయకుడిగా ఎదుగుతాాడా లేక హిందూపురం ఎంపిగా మిగిలిపోతాడా అనేది కాలం నిర్ణయిస్తుంది.
ఇప్పటికయితే, ఆయన్ని ప్రజలు పులిలాా చేస్తున్నారు. ఆయన పులిలా తిరగాలనుకుంటున్నారు. పులిలా పనిచేయాలనుకుంటున్నారు,  ఆయన కనబడితే చాలు ‘అదిగో పులి’ అంటున్నారు.
ఇది కళ్యాణ్ దుర్గంలో జరిగిన ఒక సభలో  జరిగింది ఒక సాక్ష్యం.
‘అదిగో పులి … పులి… వచ్చేసింది రోయ్, పులి!’ అనేది  ఈ రోజు ఎంపీ మాధవ్ సభలో అడుగు పెట్టగానే   ప్రజలు పెద్ద ఎత్తున చేసిన నినాదం.
ఈ నినాదంతో, చప్పట్లతో, హర్షధ్వానాలతో సభ ప్రాంగణం మొత్తం మారుమ్రోగిపోయింది.

 

 

సందర్భం:
ముఖ్యమంత్రి జగన్ పాదయాత్ర మూడో వార్షికోత్సవం సందర్భంగా  ఈ రోజు  వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించే  నిమిత్తం జిల్లా ఇన్చార్జి మంత్రి బొత్స సత్యనారాయణ కళ్యాణదుర్గం కు విచ్చేశారు.
శంకుస్థాపన చేసిన అనంతరం  బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభకు గోరంట్ల మాధవ్ కొద్దిగా ఆలస్యంగా చేరుకున్నారు. అయితే, సభలోకి ప్రవేశించగానే…జనం ఆయన కోసమే ఎదురుచూస్తున్నారా అన్నట్లు ఒక్క పెట్టున ‘అదిగో పులివచ్చె…’  ‘పులి వచ్చెరోయ్’  అని నినదించారు. చ్పట్లు కొట్టారు. ఈలలేశారు. కెేకలేశారు.
ఈ నినాదాల హోరు రెండు మూడు నిమిషాలు సద్దుమణగ లేదు.సభలో ముఖ్యఅతిధులుగా వచ్చిన మంత్రులు మాట్లాడాల్సిన ఉన్నందున నిశబ్దంగా ఉండాలని ప్రేక్షకులను వారించేందుకు మాధవ్ బాగా కష్టపడాల్సి వచ్చింది. వారిని సంతృప్తి పరించేందుకు క్లుప్తంగా ప్రసంగించాల్సి వచ్చింది.
బిసిల నుంచి, మహిళలనుంచి కొత్త నాయకత్వం తయారు చేసేందుకు ముఖ్యమంత్రి తీసుకుంటున్న చర్యలను ఆయన వివరించారు.
ఈ సభకు మంత్రి శంకర్ నారాయణ, ఎంపీలు గోరంట్ల మాధవ్, తలారి రంగయ్య , స్థానిక శాసన సభ్యురాలు ఉష చరణ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశానికి పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *