తూర్పుగోదావరి జిల్లా నుంచి 643 కేసులు, రాష్ట్రమంతా 2602 కేసులు

ఏపీలో గత 24 గంటలలో కొత్తగా 2,602 కరోనా కేసులు నమోదయ్యాయి. 42 మంది మృతి చెందారు. ఈరోజుతో రాష్ట్రంలో మొత్తం  పాజిటివ్ కేసులు 40,646కి చేరాయి. ఇంతవరకు కరోనా వల్ల 534 మంది మృతి చెందారు.
 గత 24 గంటలలో తూర్పు గోదావరి నుంచి అత్యధికంగా 643 కేసులు నమోదయ్యాయి. గుంటూరు జిల్లా 367 కేసులతో రెండో స్థానంలో ఉంటే, 315 కేసులతో కర్నూలు జిల్లా మూడో స్థానంలో ఉంది. నిన్న 590 కేసులు కనిపించడంతో కర్నూలు పట్టణంలో మళ్లీ లాక్ డౌన్ విధించారు. ఉదయం ఆరునుంచి 11 దాకా దుకాణాలను అనుమతించి తర్వాత బంద్ పాటించాలని ఆదేశించారు.
జిల్లాల వారీగా కరోనా వివరాలు: