భారత్ కోవిడ్ కొత్త కేసుల కంటే రికవరీలే ఎక్కువ

 కోవిడ్ రిపోర్టు:  42,156 రికవరీలు… 41,100 కొత్త కేసులు
 భారతదేశంలో కరోనా వ్యాప్తి క్రమంగా తగ్గుముఖం పడుతున్నది.  రోజు వారి కేసులు 50 వేల కంటే తక్కువగా  నమోదవుతున్నాయి. ఇలా గత వారం రోజులుగా జరుగుతూ ఉంది. గత 24 గంటల్లో 8,05,589 పరీక్షలు జరపగా కొత్త కేసులు కేవలం 41,100 మాత్రమే నమోదయ్యాయి. అంతకు ముందటి 24 గంటల కాలంతో  పోలిస్తే  ఇది  8శాతం తక్కువ. దేశవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 87,73,479కి చేరింది. వీరిలో 82,05,728 మంది కోలుకున్నారు.

 

నిన్న ఒక్క రోజే 42,156 మంది ఆస్పత్రి నుంచి డిశ్ఛార్జి అయ్యారు.  మరో 4,79,216 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. క్రియాశీల కేసుల సంఖ్య 5.44 శాతానికి తగ్గింది. ప్రస్తుతం మరణాల రేటు ఇంకా భారీగా తగ్గి  1.47 శాతానికి పడిపోయింది. రికవరీ రేటు 93.09 శాతానికి పెరగడం ధీమా పెంచే ఆరోగ్యకరమయిన వార్త. దేశవ్యాప్తంగా కొత్తగా 447 మంది కరోనా సోకి ప్రాణాలు కోల్పోవడంతో మరణాల సంఖ్య 1,29,635కి చేరింది. కోవిడ్ సగటు కొత్త  కేసుల సంఖ్య గత ఐదు వారాలుగా క్రమంగా తగ్గుతూ ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *