మనోవేదనలో 4203 కానిస్టేబుల్ అభ్యర్థులు: సిఎం కు వంశీచంద్ రెడ్డి లేఖ

జటిలమయిన విధానం ద్వారా తెలంగాణ రాష్ట్రంలో  కాన్ స్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికయిన వారికి ఇంకా పోస్టింగ్ ఇవ్వనందున వారంత తీవ్రమనోవేవదనకు గురవుతున్నవిషయాన్ని మాజీ ఎమ్యెల్యే, ఏఐసీసీ కార్యదర్శి చల్లా వంశీచంద్ రెడ్డి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు దృష్టి కి తీసుకువచ్చారు. ఈ రోజు ముఖ్యమంత్రికి ఒక లేఖ రాస్తూ సుమారు నాలుగు వేల మందిలో ఆత్మస్థయిర్యం కలిగించే చర్యలు తీసుకోవాలని ఆయన ముఖ్యమంత్రిని కోరారు.
లేఖ విశేషాలు :
2018 లో రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ కానిస్టేబుల్ ఎంపిక కోసం 18,000 పోస్టుల భర్తీ కై ఉద్యోగ నియామక ప్రకటన ఇచ్చింది. అందులో లక్షలాది మంది అర్హత గల నిరుద్యోగ యువకులు దరఖాస్తు చేసుకున్నారు.
వారికి అనేక రకాల వడపోతలు, రాత పరీక్షలు, శారీరక పరీక్షలు, పరుగు పరీక్షలు ఇలా నియమ నిబంధనలు పాటిస్తూ పరీక్షలు నిర్వహించి 18000 మంది నిరుద్యోలను పోలీస్ కానిస్టేబుళ్ల ఉద్యోగాలకు ఎంపిక చేసారు.
అయితే ఇందులో 4,203 మంది తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రీక్యూట్మెంట్ బోర్డు ద్వారా నియామకం అయ్యారు. వీరు కాకుండా మిగతా 14 వేల మంది ఏ ఆర్, సివిల్ అభ్యర్థులకు మాత్రం ప్రభుత్వం శిక్షణ ఇస్తుంది. TSSP పోలీస్ అభ్యర్థులకు మాత్రం ఎటువంటి శిక్షణ కు సంబంధించిన సమాచారం లేదు.
ఈ కరోనో సమయంలో కూడాCIVIL,AR,SPF, COMMUNICATION,JAIL WARDARS వారికి శిక్షణ ఇస్తున్నారు. కానీ TSSP కానిస్టేబుల్స్ కి శిక్షణ విషయంలో ప్రభుత్వం కానీ,తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రెక్కుట్మెంట్ బోర్డు కానీ పట్టించుకోవడం లేదు.
ఈ విషయంలో వారు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు.వారు పని చేసుకుందాం అంటే ఏదైనా సమస్య ఉత్పన్నం అయి మెడికల్ గా అనర్హులం ఆవతమేమో అనే భయం తో,ఉద్యోగులుగా ఎంపికయ్యి కూడా నిరుద్యోగులుగా ఉండడంతో వారి ఆవేదన వర్ణనాతీతం.
TSSP అభ్యర్థుల శిక్షణ ఒకవేళ ఇంకా ఎక్కువ కాలం ఆలస్యం అయిన పక్షంలో, వారు సర్వీస్ కోల్పోతామనే భయాందోళనలో ఉన్నారు.
అందువల్ల ఈ విషయంలో మీరు సహృదయంతో స్పందించి తగిన చర్యలు తీసుకొని 4,203 తెలంగాణ బిడ్డలను ఆదుకొని వారికి వెంటనే శిక్షణ ఇప్పించగలరు…..