ఓటేసే ముందు నిరుద్యోగుల వ్యథ గుర్తుంచుకోండి: దాసోజు

ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటేసే ముందు టిఆర్ ఎస్ ప్రభుత్వం తెలంగాణ యువకులకు, నిరుద్యోగులకు  చేస్తున్న ద్రోహాన్ని గుర్తుంచుకోవాలని ఎఐసిసి జాతీయప్రతినిధి  శ్రవణ్ దాసోజు తెలంగాణ వోటర్లకు గుర్తు చేశారు.

నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల నియోజిక వర్గంలో రాములు నాయక్ ని,మహబూబ్ నగర్, రంగా రెడ్డి, హైదరాబాద్ పట్టభద్రుల నియోజిక వర్గంలో మాజీ  జి చిన్నా రెడ్డిని  గెలిపించాలని ఆయన కోరారు.

ప్రత్యేక తెలంగాణ వచ్చాక ఏర్పడిన టిఆర్ ఎస్  ప్రభుత్వం కంటే ఉమ్మడి రాష్ట్రంలోనే ఎక్కువ ఉద్యోగాలు లభించాయని చెబుతూ ఈ ఎన్నికల్లో టిఆర్ ఎస్ కు తగిన బుద్ధిచెప్పకపోతే, నిరుద్యోగులకు ఎప్పటికీ న్యాయంజరగదని ఆయన అన్నారు.

”ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో స్కిల్ డెవలప్ మెంట్ బోర్డ్ ద్వారా 5లక్షల ఉద్యోగాలకు శిక్షణ, ఉపాధి కల్పనా చేసారు. దాదాపు 770 కోట్ల రూపాయిలు ఖర్చుతో యువత స్కిల్ డెవలప్ చేసి టైలరింగ్ నుండి డైమండ్ కటింగ్ వరకూ శిక్షణ ఇప్పించి ఉద్యోగ కల్పన చేశారు. మరి టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఏమైయింది ? ఏడేళ్ళలలో ఒక్కడికైనా స్కిల్ డెవలప్ చేశారా ? తెలంగాణ నిరుద్యోగులకు ఉద్యోగాలు రావద్దా ? ఒక్కసారి ఆత్మ విమర్శ చేసుకోండి కేటీఆర్. ఈ ఏడేళ్ళలో మీరు యువత స్కిల్ డెవలప్ చేయకపోవడం వలన ఎంతమంది యువత నిరుద్యోగంతో బాధపడుతున్నారో ఆలోచనా ఉందా? ఎందుకు ఇంత భాదత్య రాహిత్యంగా వ్యవహరించి తెలంగాణ ప్రజల నోట్లో మట్టికొడుతున్నారు? ”అని  దాసోజు విమర్వించారు.

డియస్సీ ద్వార ముమ్మడి రాష్ట్రంలో కొన్ని వేల ఉద్యోగాలు భర్తీ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం హయంలోనే 2004, 2006, 2008, 2011 ఇలా వరుసగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చింది. కానీ ప్రత్యేక రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం టీచర్ ఉద్యోగాల భర్తీని పూర్తిగా విస్మరించింది. డియస్సీ ఉద్యోగాలు.. ఉద్యోగాలు కావా ? టీచర్ ఉద్యోగాలని నియామకం చేయాల్సిన అవసరం తెలంగాణాలో లేదా ? టీచర్ ఉద్యోగాలు ఎందుకు భర్తీ చేయలేదు? మీ కారణంగా అనేక ప్రభుత్వ స్కూల్స్ మూతపడ్డాయి. ప్రజలు కష్టపడి సంపాదించిన డబ్బులు కార్పోరేట్ దోపిడీకి గురురౌతున్నాయి. మీరు కానీ సక్రమంగా టీచర్ నియామకాలు చేపట్టివుంటే ప్రజలకు ఈ పరిస్థితి వచ్చేదా? అని ప్రశ్నించారు దాసోజు.

ఇటీవల జరిటిన న్యాయవాద దంపతుల హత్య కేసులో కేటీఆర్, కేసీఆర్ లు  అడ్వకేట్ల ఓట్ల కోసం మొసలికన్నీరు కారుస్తున్నారని చెబుతూ. ఇది ముమ్మాటికి ప్రభుత్వం చేసిన హత్య అని శ్రవణ్ విమర్శించారు.

‘వామనరావు పై కేసీఆర్ ప్రభుత్వం సుప్రీం కోర్టులో కేసు వేసింది. కానీ కోర్టు కేసుని స్వీకరించలేదు. ఈ పరిణామం జరిగిన కొద్ది రోజుల్లోనే న్యాయవాద దంపతులు హత్యకు గురయ్యారు. ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని న్యాయవాదుల ఓట్లు అడుగుతున్నారు. హంతకులకు న్యాయవాదుల ఓట్లు అడిగే హక్కు ఉందా? ” అని ఆయన ప్రశ్నించారు.

ఉద్యోగ భర్తీలు , న్యాయవాదుల సమస్యలపై గాంధీ భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో దాసోజు శ్రవణ్ మాట్లాడారు.

“ఉద్యోగ ఖాళీలు, భర్తీలు అనే అంశంపై బహిరంగ చర్చకు మంత్రి కేటీఆర్ రావాలని సవాల్ చేశాం. కానీ కేటీఆర్ చర్చకు వచ్చే సాహసం చేయలేదు. అయినప్పటికీ ఉద్యోగాలు ఖాళీగా వున్నాయని కేటీఆర్ ఒప్పుకోవడాన్ని కాంగ్రెస్ పార్టీ పక్షాన స్వాగతిస్తున్నాం. ఐతే కేటీఆర్ కి ఒక సూటి ప్రశ్న. గత ఏడేళ్ళు నుండి నేటి వరకూ ఖాళీగా వున్నాయని మీరే చెబుతున్నా ఒక లక్షా తొంబై ఒక్కవేల ఉద్యోగాలు ఎందుకు భర్తీ చేయలేదో దానికి కారణాలు, సమాధానాలు కూడా చెప్పండి. అసలు మీకు ఉపాధి కల్పనపై మీకు ఒక పాలసీ అంటూ లేదు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలనే కమిట్మెంట్ మీకు లేదు” అని ధ్వజమెత్తారు దాసోజు శ్రవణ్.

హాస్పిటల్ లో వైద్యులు, సిబ్బందిని భర్తీ చేయక వైద్య వ్యవస్థని దెబ్బ తీశారు. గత ఏడేళ్ళు గా కుంభకర్ణుడు నిద్రపోతున్నట్లు వ్యవహరించి వ్యవస్థల్ని భ్రస్టుపట్టించారు. బహిరంగ చర్చకు రమ్మంటే రాకుండా ఏపీపీఎస్సీ ద్వారా కేవలం ఇరవై నాలుగు వేల ఉద్యోగాలే ఇచ్చారని కేటీఆర్ మళ్ళీ అదే అసత్యం మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు.

ఐటీఐఆర్ పై కాంగ్రెస్ పార్టీ దగ్గర పరిష్కారం వుంది:

”ఐటీఐఆర్ పై టీఆర్ఎస్, బిజెపి బురద చల్లుకుంటున్నాయి. లేఖలు రాసుకుంటున్నాయి. ఐతే ఈ లేఖల వల్ల ఎలాంటి ఉపయోగం వుండదు. దీనికి పరిష్కారం కాంగ్రెస్ పార్టీ దగ్గర వుంది. ఎందుకంటే ఐటీఐఆర్ రాహుల్ గాంధీ గారి కల. కాంగ్రెస్ హయంలో 5వేల ఎకరాల భూములని గుర్తించారు. కేంద్రం కేవలం 13వేల కోట్ల రూపాయిలు 15ఏళ్ల కాలంలో ఖర్చుపెట్టాలి. ఈ 13వేల కోట్ల రూపాయిలని రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుండి ఖర్చుపెడదాం. ప్రాజెక్ట్ కి సంబధించిన అన్ని మౌలిక వసతులు మన దగ్గర వున్నాయి. ఇక కేంద్ర ప్రభుత్వం నుండి కావాల్సింది ట్యాక్స్ రిబేట్స్, దిగుమతి , ఎగుమతి పన్ను ప్రోత్సాహకాలు. వీటిని మోడీ ప్రభుత్వం మెడలు వంచి వీటి సాధిద్దాం. మీకు దమ్ములేకపొతే మీ వెంటే కాంగ్రెస్ పార్టీ వస్తుంది, రాహుల్ గాంధీ గారు వస్తారు. ఈ ప్రాజెక్ట్ వలన రెండున్న లక్ష కోట్ల రూపాయిల ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి. యాబై లక్షల ఉద్యోగాలు వస్తాయి. మేడిన్ తెలంగాణ అనేది రాహుల్ గాంధీ కల,’ అని ఆయన అన్నారు.

”తెలంగాణలోని పట్టభాద్రులందరికీ చేతులెత్తి నమస్కారం చేస్తున్నా. ఒక్కసారి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *