విజయవాడ కనకదర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన ముఖ్యమంత్రి

దసరా శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా మూలా నక్షత్రం రోజున విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకుని రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎం  వైఎస్‌ జగన్‌ పట్టు వస్త్రాలు, పసుపు కుంకుమలను సమర్పించారు.
సంప్రదాయ దుస్తుల్లో అమ్మవారిని దర్శించుకున్న సీఎంను ఆశీర్వదించి, వేదపండితులు ప్రసాదాలు అందజేశారు. అనంతరం దుర్గా మల్లేశ్వర స్వామి వారి ఆలయ 2021 క్యాలెండర్‌ను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు.
అనంతరం దుర్గగుడి ఘాట్‌రోడ్‌లో కొండచరియలు విరిగిపడిన ప్రాంతాన్ని   ముఖ్యమంత్రి పరిశీలించారు.
భక్తుల రక్షణకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
దుర్గ గుడి మాస్టర్‌ప్లాన్‌కు అవసరమైన నిధులను వెంటనే విడుదల చేయాలని ఆయన ఆదేశించారు.