చంద్రబాబుకు షాక్, వైసిపిలో చేరనున్న కరణం బలరాం

తెలుగు దేశం పార్టీ సీనియర్ నాయకుడు,చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం కృష్ణ మూర్తి వైసిపిలో చేరుతున్నారు.  2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన వైసిపి అభ్యర్థి అమంచి కృష్ణమోహన్ ని వోడించారు.  ఈ రోజు ఆయన  తాడేపల్లి లో ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో లో అటవీ శాఖ  మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి  సమక్షంలో వైసిపిలో  చేరుతున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి  ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తారు. చీరాలలో తన కార్యాలయం నుంచి కరణం బలరాం పెద్ద ఎత్తున అనుచరులతో జగన్ ను కలుసుకునేందుకు బయలు దేరారు.
వైసిపిలో చేరుతున్న విషయాన్ని బలరాం ప్రకటించగానే, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అత్యవసరం సమావేశం ఏర్పాటుచేసి జిల్లా రాజకీయ పరిస్థితిని సమీక్సించారు. జిల్లా ఇన్ చార్జ్ గా యడం బాలాజీని నియమించారు.