రాజధాని రైతులపై కేసులు నమోదు

అమరావతి :రాజధాని రైతులపై కేసులు నమోదు చేశారు.

ముఖ్యమంత్రి మూడు రాజధానుల ప్రకటనకు నిరసనగా నిన్న సచివాలయం వైపు దూసుకెళ్ళేందుకు ప్రయత్నించిన వారిపై కేసులు నమోదు చేశారు. ఇలాగే ఈ రోజు వెలగపూడిపంచాయతీ ఆఫీస్‌కు నల్ల రంగులు వేసినందుకు, నీటి సరఫరా నిలిపివేసినందుకు కూడా కేసులు నమోదు చేశారు*

*ఆందోళనలు చేసే ప్రతి రైతుపై ఏదో ఒక కేసు నమోదు చేశారు. రాజధాని ప్రాంతంలో 144 సెక్షన్, 30 పోలీస్ యాక్ట్ కొనసాగుతోంది.

*హింసాత్మక ఘటనలకు పాల్పడితే చట్టపరమైన చర్యలుంటాయని పోలీసులు హెచ్చరించారు*.