క్వారంటైన్ లో ముఖ్యమంత్రి కేజ్రీవాల్, రేపు కోవిడ్-19 పరీక్ష

ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాజ్ క్వారంటైన్ లోకి వెళ్లారు. నిన్నటి నుంచి ఆయన కొద్ది జ్వరం, గొంతురాపిడి ఉండటంతో ఆయన సెల్ఫ్ క్వారంటైన్ లోకి వెళ్లారు.  మంగళవారం నాడు ఆయన కోవిడ్ -19 పరీక్ష చేయించుకుంటారు. ఇప్పటికే ఆయనకు షుగర్ వ్యాధి ఉంది.

ఆదివారం నాడు ఆయన క్యాబినెట్ సమావేశంలో పాల్గొన్నారు. ఈ మధ్య సాధ్యమయినంతవరకు ఆయన వీడియో కాన్ఫరెన్స్ ల ద్వారానే సంప్రదింపులు జరుపుతున్నారు. ఆదివారం నాడు క్యాబినెట్ సమావేశం తర్వాత ఆయనక కొద్దిగా జర్వం వచ్చింది. దీనితో తన కార్యక్రమాలన్నింటిని రద్దు చేసుకున్నారు. ఢి్ల్లీ ఆసుపత్రులలో ఢిల్లీ వాసులకే చికిత్ప చేయాలని ఈ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. అయితే, లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ కొట్టి వేశారు.

అనంతరం ఆయన డాక్టర్ల సూచన మేరకు సెల్ఫ్ క్వారంటైన్ లో ఉంటున్నారు. మంగళవారం నాడు పరీక్ష చేయించుకుంటారని ఆయన సన్నిహితులు తెలిపారు.