ఎపి టెన్త్ షెడ్యూల్ ఇంకా విడుదల చేయలేదు: కమిషనర్

 పదో తరగతి పబ్లిక్ పరీక్షల షెడ్యూల్ ఇంకా విడుదల చేయలేదని,తప్పుడు ప్రచారం చేస్తే క్రిమినల్ కేసులు పెడతామని  పాఠశాల విద్యాశాఖ కమీషనర్ వాడ్రేవు చినవీరభద్రుడు హెచ్చరించారు. ఈ  మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. 
ప్రకటన ఇదే
పదో తరగతి పబ్లిక్ పరీక్షల అనధికార షెడ్యూలును సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తున్నవారిపై క్రిమినల్ కేసులు పెడతాం.ఇటీవల 15వ తేదీ నుంచి పరీక్షలంటూ ప్రచారం చేసి విద్యార్థులు, తల్లిదండ్రులు భయాందోళనకు గురయ్యేలా కొంతమంది వదంతులు సృష్టించారు. ఈసారి వదంతులతో ఆగకుండా కమీషనర్ సంతకం ఫోర్జరీ చేసి, మే 18 నుంచి మే 25 వరకు పదో తరగతి పరీక్షలంటూ షెడ్యూలును వాట్సప్ లో విస్తృత ప్రచారం చేస్తున్నారు.  ఈ విషయంలో  సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నాం. విద్యార్థులు, తల్లిదండ్రులు ఒత్తిడికి గురికావొద్దని విజ్ఞప్తి
-వాడ్రేవు చినవీరభద్రుడు, ఐ.ఏ.ఎస్
కమీషనర్, పాఠశాల విద్యాశాఖ (పూ.అ.బా.), ఆంధ్రప్రదేశ్