2282 కు చేరిన ఎపి కరోనా కేసులు, 3 జిల్లాలనుంచి నిన్న జీరో కేసులు

ఆంధ్ర ప్రదేశ్ లో గత 24 గంటలలో 52 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. దీనితో మొత్తం కేసుల సంఖ్య2282 కు చేరింది. ఇందులో చికిత్సతీసుకుని విడుదలయిన వారి సంఖ్య 1527. ఇంకా ఆసుప్రతులలో చికిత్సపొందుతున్న యాక్టివ్ కేసుల సంఖ్య705. రాష్ట్రంలో కోవిడ్ -19 వల్ల మృతి చెందిన వారి సంఖ్య 50కి చేరింది.

కరోనా హాట్ స్పాట్ గా ఉన్న గుంటూరుజిల్లాలో తో పాటు ప్రకాశం, శ్రీకాకుళం అనంతపురం జిల్లాల నుంచి గత 24 గంటలలో ఒక్క కేసుకూడా నమోదుకాలేదు. అయితే, కృష్ణా, చిత్తూరు జిల్లాల నుంచి మాత్రం  15 చొప్పున కేసులు నమోదయ్యాయి.