ఆగస్టు 3న ఆంధ్రా స్కూళ్లు ప్రారంభం: సీఎం జగన్

ఆగస్టు 3 రాష్ట్రంలో పాఠశాలలు ప్రారంభమవుతాయని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు.
క్యాంపు కార్యాలయంలో కలెక్టర్లు, జేసీలు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్‌ లో ప్రసంగిస్తూ ఆయన ఈ విషయం వెల్లడించారు.
స్కూళ్లు తెరిచే లోపు గతంలో ప్రారంభించిన అన్ని అభివృద్ధి పనులు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.
జులై నెలాఖరులోగా మొదటి విడతలో చేపట్టిన 15,715 స్కూళ్లలో నాడు–నేడు కింద అభివృద్ధి పనులు పూర్తిచేయాల్సి ఉంది.  మొత్తం 9 రకాల సదుపాలను కల్పించాల్సి ఉంది.దీనికి సంబంధించి రూ.456 కోట్ల రివాల్వింగ్‌ ఫండ్‌ కూడా విడుదల చేశాం. జులై నెలాఖరు కల్లా అన్ని స్కూళ్లలో పనులు పూర్తి కావాలంటే  కలెక్టర్లు ప్రతిరోజూ రివ్యూ చేయాలి
ఈ పనులకోసం సిమెంటు, ఇసుక సరఫరాకు ఇబ్బందులు లేకుండా చూడాలి,’ అని ముఖ్యమంత్రి చెప్పారు.