ఆంధ్ర డిఎస్ పి ఆత్మహత్య

ఆంధ్రప్రదేశ్  శ్రీకాకుళం స్పెషల్ బ్రాంచ్ డి.ఎస్పీగా విధులు నిర్వహిస్తున్న కృష్ణ వర్మ  విశాఖపట్నం లో ఆత్మహత్య  చేసుకున్నారు.  బీచ్ రోడ్ లోని ఇంటిలో ఉరి వేసుకుని  ఆత్మహత్య చేసుకున్నారని సమాచారం అందింది. అనారోగ్య సమస్యలతో ఆత్మహత్య చేసుకున్నట్లుచెబుతున్నారు. ఆయన చాలా కాలం శ్రీకాకుళంలో ఎస్ ఐ గా పనిచేశారి, తర్వాత పదోన్నతుల మీద డిఎస్ పి అయ్యారని  సాక్షి రాసింది.  ఈ మధ్యే ఆయనకు గుండె ఆపరేషన్ కూడా జరిగింది. పూర్తి  వివరాలు అందాల్సి ఉంది.