ఏపీలో 2407 కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు

గడిచిన 24 గంటల్లో 68 కొత్త  పాజిటివ్ కేసులు నమోదు కావడంతో  ఆంధ్రప్రదేశ్ కరోనాకేసుల సంఖ్య 2407 కు చేరింది. కర్నూలులో ఒక వ్యక్తి మృతి చెందడంతో మొత్తం మృతులు 53 అయ్యారు.
ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటీన్ ప్రకారంన గత 24 గంటలలో 9159  మంది శాంపిల్స్ పరీక్షిస్తే ఈ 68  కేసులు బయటపడ్డాయి. అయితే, నిన్న ఒక్క రోజు రాష్ట్రంలో 43 మంది కరోనాను జయించి ఆసుపత్రులనుంచి విడుదలయ్యారు.
ఇంతవరకు మొత్తం డిశ్చార్జ్ అయిన వారు 1639 మంది కాగా ప్రస్తుతం ఆసుపత్రులలో ఉన్న యాక్టివ్ కేసులు 715 మాత్రమే.
రాష్ట్రంలో నమోదయిన కొత్త కేసులలో పది కేసులు (చిత్తూరు 6, నెల్లూరు 4) తమిళనాడు కోయంబేడు మార్కెట్ ను సందర్శించి వచ్చినవారనని ఆరోగ్య శాఖ తెలిపింది.