రాజధాని మీద క్యాబినెట్ నిర్ణయం వాయిదా… బోస్టన్ గ్రూప్ నివేదిక వచ్చాకే నిర్ణయం

వెలగపూడి సచివాలయంలో ముగిసిన మంత్రి వర్గ సమావేశం మూడు రాజధానుల మీద ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.  ఈ విషయాన్ని బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ (బిసిజి) నివేదిక వచ్చే దాకా వాయిదా వేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది.
ఈ రోజు కట్టుదిట్టమయిన భద్రతా ఏర్పాట్ల మధ్య, కొంతమంది రైతుల, తెలుగుదేశం, బిజెపి కార్యకర్తల నిరసనల మధ్యక్యాబినెట్ సమావేశం జరిగింది. సుమారు రెండు గంటల సేపు వివిధ అంశాలను చర్చించింది.
సమావేశంలో క్యాబినెట్ జి ఎన్ రావుకమిటీ నివేదిక మీద చర్చించినట్లు తెలిసింది. అయితే,   బోస్టన్  గ్రూప్ నివేదిక ఇంకా రాలేదు కాబట్టి రాజధాని మీద ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని సమాచారం అందింది. ఆ నివేదిక వచ్చాక, జిఎన్ రావు కమిటీతో కలిపి పరిశీలించి నిర్ణయం తీసుకుంటారని తెలిసింది.