జగన్ మీద ఆంధ్ర బిజెపి కత్తి దూసినట్లేనా?

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద భారతీయ జనతా పార్టీ రెండు వైపుల నుంచి దాడి ప్రారంభించింది, ఇది సమర శంఖం పూరించడమేనని తిరుపతికి చెందిన సీనియర్ జర్నలిస్టు నాటుబాంబుల సుధాకర్ రెడ్డి అంటున్నారు. అమరావతి పరిరక్షణ, మతమార్పిడి ప్రోత్సాహం పేరుతో బిజెపి ఇక జగన్ కు వ్యతిరేకంగా ప్రచారం మొదలు పెడుతుందని ఆయన చెబుతున్నారు. జగన్ పట్ల తమ వైఖరి ఏమిటో కొత్త అధ్యక్షుడు సోము వీర్రాజు బాధ్యత స్వీకార సభలో పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్, ఇతర వక్తులు స్పష్టం చేశారని ఆయన చెబుతున్నారు. ఆయన ఏమి చెబుతున్నారో చూడండి.