ఆంధ్రలో జూన్ 8 నుంచి హోటళ్లు రెస్టరాంట్లు ఒపెన్

కరోనా లాక్ డౌన్‌ నిబంధనలు సడలించిన నేపధ్యంలో ఈ నెల 8 నుంచి ఆంధ్రప్రదేశ్  టూరిజం ప్రాంతాల్లో హోటల్లు,‌ రెస్టారెంట్లు ఓపెన్ చేయాలని నిర్ణయించామని మంత్రి  అవంతి శ్రీనివాస్ వెల్లడించారు.
టూరిజాన్ని ఒపెన్ చేయడం కేంద్ర ప్రభుత్వ నిభందనల ప్రకారమే జరుగుతుందని చెబుతూ  విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి,‌ కాకినాడ పట్టణాల్లో హోటల్లు, రెస్టారెంట్లను 8 నుంచి ప్రారంభిస్తున్నామని శ్రీనివాస్ చెప్పారు.

 

 లాక్ డౌన్ అమలులో ఉన్న మూడు నెలలకు ఎపి టూరిజం నుంచి రాష్ట్రానికి ముప్పై కోట్లు నష్టం వచ్చిందని ఆయన చెప్పారు.
’ఎపి లో పర్యాటకుల్ని ఆక్షర్షించేందుకు అన్ని వనరులున్నాయి. టెంపుల్ టూరిజం ను ప్రోత్సహిస్తున్నాం. యాత్రికులకు కావాల్సిన హోటల్లు, రెస్టారెంట్లు అన్నీ సిద్దంగా ఉంచాం. ఇతర టూరిస్టులకు కరోనా దృష్ట్యా అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తున్నాం,’ అని ఆయన చెప్పారు.
రాబోయే రోజుల్లో అరకు, మారెడిమిల్లి లాంటి టూరిజం ప్రదేశాల్లో 5 స్టార్, 7 స్టార్ హోటల్స్ పెట్టాలని కసరత్తు చేస్తున్నామని సోమవారం నుంచి హోటల్స్ బుకింగ్ ఆన్ లైన్ లో చేసుకోవచ్చనని కూడా ఆయన చెప్పారు.
కరోనా ప్రోటొకోల్ ప్రకారం పర్యాటకానికి అన్ని జాగ్రత్తలు పాటిస్తున్నాం.టూరిస్టులు కూడా తమ వంతుగా కరోనా  జాగ్రత్తలు పాటించాలని ఆయన చెప్పారు.
రాష్ట్రంలో 9 కమాండ్ కంట్రోల్‌రూం లను ముఖ్యమంత్రి జగన్ చేతుల మీదుగా‌ వచ్చే వారం రోజుల్లో ప్రారంభించనున్నామని,  కమాండ్ కంట్రోల్ రూం ప్రారంభమైన తర్వాత బోట్లను పునరుద్దరిస్తామని ఆయన చెప్పారు.