ఆంధ్రలో నేడు 8,147 కొత్త కేసులు, వేయి చేరువలో మృతుల సంఖ్య

ఆంధ్రప్రదేశ్ లో కరోనా మరణాలు వేయికి చేరువుతున్నాయి.  గత 24 గంటలలో కోవిడ్ తో 49 మరణించడంతో మొత్తం మృతుల సంఖ్య 933 కు చేరింది. కొత్త కేసులకు సంబంధించి  గత 24 గంటలలో 8147 పాజిటివ్ అని నిర్దారణ అయింది. అయితే,రాష్ట్రంలో కరోనా పరీక్షలు కూడా ఎక్కువగా జరుగుతున్నాయి. నిన్న 48,114 శాంపిల్స్ ను పరీక్షించారు. నేటితో  రాష్ట్రంలో నమోదయిన మొత్తం కరోనా కేసులు 80,858కి చేరుకున్నాయి. యాక్టివ్ కేసులు 39,990.
ఇక జిల్లాలకు సంబంధించి తూర్పు గోదావరి,అనంతపురం, విశాఖ , పశ్చిమగోదావరి జిల్లాలు అగ్రస్థానంలో ఉన్నాయి. తూర్పు గోదావరి నుంచి 1029కేసులు నమోదయితే, అనంతపురం నుంచి 984 కేసులు, విశాఖ పట్టణం జిల్లా నుంచి 890  కేసులు నమోదయ్యాయి.  పశ్చిమ గోదావరి జిల్లాలో807 కేసులు నిర్ధారణ అయ్యాయి. ఈ సారి అతి తక్కువ కేసులు నమోదయింది నెల్లూరు జిల్లా నుంచి. అక్కడ 278 కరోనా పాజిటివ్ కేసులు కనిపించాయి.
భారతదేశంలో కరోనా కేసులు 13 లక్షలకు చేరుకుంటున్నాయి.నిన్న యాబై వేల కేసులు నమోదయ్యాయి. ఇందులో ఆంధ్ర వాట రోజురోజుకు పెరుగుతున్నది.