ఆంధ్రలో 33 కొత్త కరోనా కేసులు, మొత్తం 2051

గత 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్ లో 33 కొత్త కేసులు నమోదయ్యాయి. దీనితో మొత్తం కేసుల సంఖ్య 2051కి చేరింది. ఇందులో 1056 మంది చికిత్సతీసుకుని ఆసుపత్రి నుంచి విడుదల య్యారు. మరొక949 మంది చికిత్స పొందుతున్నారు.
ఇంతవరకురాష్ట్రంలో మృతి చెందినవారు 46 మంది. నిన్న చిత్తూరు జిల్లా నుంచి 10 కొత్త కేసులు వచ్చాయి. మిగతా వాటిలో నెల్లూరు నుంచి 9, తూర్పు గోదావరి జిల్లా నుంచి ఒకటి రాగా తమిళనాడు కోయంబేడునుంచి 20 కేసులు వచ్చాయి.
ఇక డిశ్చార్జ్ అయిన 58 మంది లో అత్యధిక సంఖ్యలో 35 మంది కృష్ణా జిల్లా నుంచి విడుదలయ్యారు. కర్నూలు జిల్లా నుంచి 17 మంది అనంతపూర్ నుంచి 3, కడప శ్రీకాకుళం, ప.గోదావరి నుంచి ఒక్కొక్కరు విడుదలయ్యారు.గత 24గంటల్లో కృష్ణాజిల్లా నుంచి ఒకరు మరణించారు.