ఆంధ్ర అటోలలో హైటెక్ ‘పానిక్ బటన్’ ఏర్పాటు

ఆంధ్రప్రదేశ్ లో ఆటో ప్రయాణం సురక్షింతగా సాగేందుకు  రవాణాశాఖ చర్యలు తీసుకుంటున్నది. బాలలు, మహిళల భద్రత కోసం ‘అభయం’ అనే సరికొత్త ప్రాజెక్ట్ ను అమలు చేస్తున్నది. ఇక నుంచి ఆటోలన్నింటిలో ప్రయాణికులకు అందుబాటులో   ఒక బటన్ ఏర్పాటుచేస్తున్నారు.  అత్యవసర సమయంలో ఈ బటన్ నొక్కితే సరి, పోలీసులు రంగ ప్రవేశం చేస్తారు. ఇలాంటి ఏర్పాటు దేశంలో ఇదే మొదటి సారి.
కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన నిర్భయ స్కీం లో భాగంగా అభయం  ప్రాజెక్టు అమలవుతుంది.
అభయం ప్రాజక్టులో ఒక మొబైల్ అప్లికేషన్ ఉంటుంది.
ప్రతి ఆటో లోనూ అభయం మొబైల్ అప్లికేషన్ ను రవాణాశాఖ అధికారులు ఇన్స్టాల్ చేస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని దాదాపు లక్ష ఆటో లను అభయం ప్రాజెక్ట్ కిందకు తీసుకురానున్నారు. దీనిలో ఆటో నెంబర్, డ్రైవర్ పేరు, ఇతర వివరాలన్నీ అప్లోడ్ చేస్తారు.
ఆటో లో ప్రత్యేకంగా పానిక్ బటన్ ను ఏర్పాటు చేస్తారు. ఈ ఆటో లలో ప్రయాణించే మహిళలు, పిల్లలు ఎవరైనా ఆపద ఉన్నట్లు గ్రహిస్తే వెంటనే ఈ బటన్ ను నొక్కాలి.
బటన్ నొక్కిన వెంటనే కమాండ్ కంట్రోల్ రూమ్ కు సమాచారం చేరుతుంది. అంతేకాకుండా బటన్ నొక్కిన వెంటనే ఆటో నుండి హెల్ప్ అని శబ్దం రావడంతో పాటు.. కొద్దీ దూరం వెళ్ళగానే వాహనం ఆటో మ్యాటిక్ గా ఆగిపోతుంది.
ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని 23/11/2020 నాడు లాంఛనంగా ప్రారంభించబోతున్నారు.
అభయం ప్రాజెక్ట్ మొదటి విడత లో భాగంగా రేపు విశాఖపట్నంలో లో వెయ్యి ఆటో లతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. డిసెంబర్ 1 వ తేదీన 5 వేల వాహనాలు, వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి లక్ష వాహనాల్లో ఈ తరహా ప్రాజెక్ట్ ను ఏర్పాటు చేస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *