50 వేల కేసుల వైపు దూసుకుపోతున్న ఆంధ్ర, నేడు 5041కేసులు

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు 50 వేల సమీపిస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో 5,041 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యాయి.దీనితో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 49,650కి చేరింది.ఇదే 24 గంటలలో కరోనా వల్ల మరణించినవారి సంఖ్య 57 మంది.ఫలితంగా రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 642కు చేరింది. వివిధ కోవిడ్-19‌ ఆసుపత్రుల్లో ప్రస్తుతం 26,118 మంది చికిత్స (యాక్టివ్ కేసులు) పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకుని ఇప్పటివరకు 22,890 మంది డిశ్చార్జి అయ్యారు. జిల్లాల వారీగా వివరాలు:
జిల్లాలలో కొత్త కేసులకు సంబంధించి తూర్పుగోదావరి జిల్లా టాప్ లో ఉంది. అక్కడ ఈ రోజు 647 కేసులు నమోదయ్యాయి. అనంతపురం జిల్లా 637కేసులో రెండో స్థానంలో ఉంది. తర్వాత స్థానం 535 కేసులతో శ్రీకాకుళం జిల్లాది. మిగతా జిల్లాల సమగ్ర సమాచారం ఇదే.