ఈ రోజు తెలంగాణలో 41 కొత్త కరోనా కేసులు, మొత్తం 1592

ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో 41 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని ఆరోగ్యశాఖ వెల్లడించింది.
రాత్రి రాష్ట్రం లో కరోనాస్టేటస్ మీద ఆరోగ్య శాఖ బులెటీన్ విడుదల చేసింది. 41 కేసులతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య  1592 కి చేరింది.
అయితే, ఈ రోజు చికిత్స పూర్తి చేసుకుని 10 మంది ఆసుపత్రి నుంచి విడుదలయ్యారు.
దీనితో మొత్తం ఇంతవరకు ఇలాడిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 1002 కు చేరింది.  ఇక 556 మంది మాత్రమే ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు.
రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం 34 మంది మృతి చెందారు. ఈ రోజు వచ్చిన కొత్త కేసులలో ఎక్కువ భాగం అంటే 26 కేసులు ఒక్క జిహెచ్ ఎంసి నుంచే ఉన్నాయి. మమరొక 12 కేసులో ఇతర రాష్ట్రాలనుంచి వారిలో కనిపించాయి. పోతే మిగతా మూడు కేసులు మేడ్చల్ నుంచి వచ్చాయి.