హైదరాబాద్: ఒకే అపార్ట్ మెంట్ లో 23 కరోనా కేసులు

హైదరాబాద్ లోని  మాదన్నపేటలో మొట్టమొదటిసారిగా ఒకే అపార్ట్మెంట్ లో 23 కేసులు నమోదయ్యాయి.
అపార్ట్ మెంట్ లో మొత్తం 50 మందికి కరోనా వైరస్  పరీక్షలు చేయగా వాటిలో ఇరవై మూడు కేసులు నమోదయ్యాయి. ఇలా ఒక చోట ఇలా పెద్ద సంఖ్యలో కరోనా కేసులు కనిపించడం ఇదే మొదటిసారి. పాజిటివ్ చూపిన  వారందరిని గాంధీకి తరలించారు.
 ఇక్కడ నమోదయిన పాజిటివ్ కేసులలో  11 నెలల పసికందు కూడా ఉందది. అపార్ట్ మెంటులో ఉన్న వారందరికి కూడా కరోనా పరీక్షలు చేశారు. మరొక ఐదుగురు రిపోర్ట్స్ రావాల్సి ఉందని అధికారులు తెలిపాారు.
హైదరాబాద్ మొత్తం  మొట్టమొదటి సారిగా ఒకే చోట భారీ కేసులు నమోదు కావటం ఆశ్చర్యకరమైన విషయం.
కరోనా పరీక్షలకి వెళ్ల లేని వారి కోసం స్వయంగా లాబ్ టెక్నీషియన్స్ అపార్ట్మెంట్ దగ్గరికి  వచ్చి ఇక్కడే పరీక్షలు నిర్వహిస్తున్నారు. మాదన్నపేట్ పరిసర ప్రాంతాల్లో దాదాపు నాలుగు వేలకు పైగా నర్సులతో స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహిస్తున్నారు.