నేడే మోగనున్న లోక్ సభ ఎన్నికల నగారా

సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధమయ్యిందీ. లోక్‌సభ ఎన్నికలతోపాటు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు అదివారం  సాయంత్రం నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఏపీ, ఒరిస్సా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ తోఅసెంబ్లీ తో పాటు లోక్ సభ ఎన్నికలకు ఈసీ ఎన్నికలు నిర్వహించనుంది. 9 లేదా 10 విడతల్లో ఈసీ ఎన్నికలు నిర్వహించనుంది.

ఇప్పటికే అన్ని రాష్ట్రాల్లో పర్యటించిన కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు ఆయా రాస్ట్రాల్లో ఉన్న ఇబ్బందులను అధ్యయనం చేశారు. గతంలో మార్చి 5 వ తేదినే ఎన్నికల నోటిపికేషన్ వెలువడింది. ఈసారి ఇప్పటికి కూడా విడుదల కాకపోయే సరికి అంతా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నోటిఫికేషన్ విడుదలైన వెంటనే ఎన్నికల కోడ్ అమల్లోకి రానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *