తిరుమలలో ఈ వస్తువుల మీద నిషేధం ఉంది…

ఆంధ్రప్రదేశ్‌ దేవాదాయ చట్టం 30/1987 ప్రకారం తిరుమల పుణ్యక్షేత్రంలో కొని నిషేధాజ్ఞలున్నాయి. ఈ చట్ట ప్రకారం కొన్ని శ్రీవారి దర్శనానికి తిరుమల వచ్చే భక్తులు ఈ వస్తువులను తమతో  తీసుకెళ్లడంగాని, దగ్గిర ఉంచుకోవడం గాని చేయరాదు.
నిరంతరం కొత్త భక్తులు తిరుమల సందర్శిస్తున్నందున టిటిడి భక్తులకు మరొక ఈ వస్తువుల విషయంలో విొప్తి చేస్తూ ఉంది,. ఈ విషయంపై దేశవ్యాప్తంగా దూరప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు అవగాహన కల్పించేందుకు విస్త తంగా ప్రచారం చేపడుతోంది.
నిషేధిత వస్తువుల్లో మత్తుపానీయాలు, పొగాకు ఉత్పత్తులు, మాంసం, ఆయుధాలు, పేలుడు సామగ్రి ఉన్నాయి.
తిరుమలలో జూదం ఆడడంతోపాటు పెంపుడు జంతువులను, పక్షులను ఉంచుకోరాదు.
లైసెన్సు గల ఆయుధాలు ఉన్న పక్షంలో సమీప పోలీస్‌ స్టేషన్‌లో వాటికి సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు సమర్పించి అప్పగించాల్సి ఉంటుంది.
నిషేధిత వస్తువులను కలిగి ఉన్న పక్షంలో సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కావున నిషేధిత వస్తువులను తిరుమలకు తీసుకురాకూడదని టిటిడి భక్తులను కోరుతోంది.