తెలంగాణ రాష్ట్రంలో విద్యాలయాల్లో వసూలు చేస్తున్న అధిక ఫీజులకు వ్యతిరేకంగా పాఠశాల కమిషనరేట్ వద్ద తెలంగాణ జన సమితి విద్యార్ధి విభాగం ధర్నా చేసింది. అయితే, వారిని చెదరగొట్టేందుకు పోలీసుల విరుచుకుపడ్డారు. లాఠీ చార్జ్ చేశారు. యువకులను తన్నుతూ,కిందపడేసి కొట్టారు. ఇది విద్యార్థులను తరిమేసేందుకు తీసుకున్న చర్య కాకుండా, ప్రతీకార చర్యలాగా కనిపిస్తుంది. ఈ దృశ్యాలు చూడండి.