గుడివాడ వింత, వైసిపిలోకి డ్వాక్రా మహిళల వలస (వీడియో)

ఎన్నిలకపుడు అన్నీ వింతలే జరుగుతుంటాయి.గుడివాడలో ఇపుడొక వింత జరిగింది. ఇది కొంచెం తెలుగుదేశం పార్టీకి ఇబ్బంది కలిగించే విషయమే .నియోజకవర్గంలో వందల సంఖ్యలో డ్వాక్రా మహిళలు వైఎస్ ఆర్ కాంగ్రెస్ చేరారు. దీనిని ఒక రాజకీయ కార్యక్రమంగా వైసిపి మలుచకుంది. గుడివాడ నియోజకవర్గం లో తెలుగుదేశం పార్టీకి డ్వాక్రా మహిళలు షాక్ ఇచ్చారని వైసిపి గొప్పగ ప్రచారం మొదలుపెట్టింది.

కృష్ణా జిల్లా నందివాడ మండలం పుట్డగుంట,లక్ష్మి నరసింహ పురం గ్రామాల నుండి వందలాది మంది తెలుగుదేశం పార్టీ అలాగే డ్వాక్రా మహిళలు కొడాలి నాని సమక్షంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ లో చేరారు, డ్వాక్రా మహిళలకు వైసిసి అభ్యర్థి కొడాలి నాని పార్టీ కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు. అంతేకాదు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని నమ్మం అంటూ నినాదాలు కూడా చేశారు.

ఈ సందర్భంగా కొంత మంది మహిళలు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత ఎన్నికల ముందు మహిళలకు అనేక హమీలు ఇచ్చి నెరవేర్చలేదని, ఇప్పుడు పసుపు కుంకుమ పేరుతో మోసం చేస్తున్నాడని విమర్శించారు.

ఇక మహిళలంతా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాటలు నమ్మే పరిస్థితి లేదని తాము వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కి జగన్మోహన్ రెడ్డి అండగా ఉంటామని తెలిపారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన నవరత్నాలు మహిళలు కు చాలా ఉపయోగపడాతాయని మహిళలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *