సెన్సేషనల్ న్యూస్: జగన్ తో సాదినేని యామినేని భేటీ? (వీడియో)

ఎన్నికల్లో టీడీపీ పరాభవం చెందినప్పటి నుండి ఆ పార్టీ అధికార ప్రతినిధి సాదినేని యామిని మీడియాలో పెద్దగా కనిపించడం లేదు. ఫలితాల ముందు వరకు అటు తెలంగాణ, ఇటు ఏపీలో ప్రత్యర్థులతో సై సై అంటూ కౌంటర్లు, ప్రతికౌంటర్లు ఇస్తుండేవారు. కానీ ఈమధ్య ఆమె కొంత మౌనం పాటిస్తున్నారు.

కాగా ఇప్పుడు సాదినేని యామినికి సంబంధించిన ఒక విషయం హాట్ టాపిక్ గా మారింది. త్వరలో ఆమెను ఏపీ సీఎం జగన్ ని కలవనున్నారు. ఈ విషయం ఆమె స్వయంగా వెల్లడించారు. ఇంతకీ జగన్ ని యామిని ఎందుకు కలవనున్నారో కింద చదవండి.

సోమవారం మంగళగిరి డీజీపీ ఆఫీస్ కి వెళ్లారు యామిని. వుమెన్ ప్రొటెక్షన్ ఎస్పీని కలిసిన యామిని… ఫేస్బుక్ లో తన పేరుతొ నకిలీ ఖాతాలు తెరిచి అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారని ఫిర్యాదు చేసారు. అర్ధరాత్రి తనకు గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి అసభ్యంగా మాట్లాడుతున్నారని పేర్కొన్నారు.

తనని, తన కుటుంబ సభ్యుల్ని బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. ఈ మేరకు ఎస్పీకి ఒక లేఖను సమర్పించారు యామిని. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆమె… సీఎంని కలిసి ఈ విషయం వివరిస్తానని వెల్లడించారు. సీఎం వెంటనే మహిళలకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేసారు. యామిని డీజీపీకి ఫిర్యాదు చేస్తున్న వీడియో కింద ఉంది చూడవచ్చు.