జనగామ ముత్తిరెడ్డి మీద హరీష్ కు ఎంత కోపమొచ్చిందో..

జనగామ ముత్తిరెడ్డి మీద మంత్రి హరీష్ కు ఎంత కోపమొచ్చిందో..
జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి షాక్ ఇచ్చారు మంత్రి హరీష్ రావు. ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి వైఖరితో అసహనం చెందిన హరీష్ రావు సభలో మాట్లాడకుండానే మైక్ పడేసి వెళ్లిపోయారు. ఈ ఘటనకు సబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

జనగామ జిల్లాలోని నర్మెట మండలం, బొమ్మకూరు గ్రామంలో జె.చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల పథకం ఫేజ్ 3 పంప్ హౌస్ ను మంత్రి హరీష్ రావు శనివారం ప్రారంభించారు. పంప్ హౌస్ నుంచి కన్నెబోయినగూడెం, లద్నూరు, తపాస్ పల్లి రిజర్వాయర్లకు నీటిని విడుదల చేశారు. అనంతరం బొమ్మకూరులో స్థానిక ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో హరీష్ రావు మాట్లాడుతున్నారు. మంత్రి మాట్లాడుతుండగా ఎమ్మెల్యే ముత్తిరెడ్డి పక్కవాళ్లతో అటు ఇటూ చూస్తూ తెగ మాట్లాడుతున్నారు. దీంతో హరీష్ రావు కు కోపమొచ్చింది. ఆ ముచ్చట బంద్ చేయాలంటూ ఒకసారి ఎమ్మెల్యేకు రిక్వెస్ట్ చేశారు. అయినా ముత్తిరెడ్డి వినిపించుకోలేదు. దీంతో కోపం ఎక్కవైన మంత్రి హరీష్ మైక్ టేబుల్ మీద పడేసి అక్కడి నుంచి అసహనంతో వెళ్లిపోయారు. ఎమ్మెల్యే ముత్తిరెడ్డి మంత్రిని ఆపే ప్రయత్నం చేసినా వినకుండా ఆగ్రహంగా హరీష్ రావు వెళ్ళిపోయారు. వీడియోలో చూడండి. హరీష్ రావుకు ఎంత కోపమొచ్చిందో..?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *