సెన్సేషనల్ న్యూస్: వైసీపీ నేత ఇంటి వెనుక నాటు బాంబులు

ఎన్నికల ముంగిట్లో పలు విషయాలు రాజకీయంగా కలకలం రేపుతున్నాయి. ఇటీవలే పులివెందులలో వైఎస్ వివేకానంద హత్య ఏపీలో సంచలనంగా మారింది. రాజకీయంగా పలు వివాదాలకు తెరలేపింది. ఈ కేసులో సిట్ బృందం దర్యాప్తు దాదాపు ముగింపు దశకు చేరుతున్నట్టు తెలుస్తోంది. కాగా అనంతపురం రాజకీయ వర్గాల్లో మరో వార్త ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

అనంతపురం జిల్లా గోరంట్ల మండలం కరవులపల్లిలో నాటు బాంబుల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. వైసీపీ నేత ఆర్.వెంకటరెడ్డి ఇంటి వెనుక చెత్తకుప్పలో నాటు బాంబులు ఉన్నట్లు స్థానిక పోలీసులకు సమాచారం అందింది.

అక్కడికి చేరుకున్న పోలీసులు నాటు బాంబులను స్వాధీనం చేసుకున్నారు. ఎలేచ్షన్స్ సమయంలో నాటుబాంబులు దొరకడంతో స్థానిక వైసీపీ వర్గాల్లో కలవరం మొదలైంది. కాగా పోలీసులు దీనిపై విచారణ చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *