తెలంగాణలో రోహిణి కార్తెలొనే వరినాట్లు పడాలి

ప్రారంభంలో నారు పోస్తే అధిక దిగుబడులు
పంట సాగు విధానంలో మార్పు రావాలి
రైతులు వ్య‌వ‌సాయ శాఖ అధికారుల సూచ‌న‌లు పాటించాలి
డిమాండ్ కు త‌గ్గ‌ట్లు పంట‌లు పండించాలి
సన్నరకాల వ‌రి సాగు చేసేలా రైతులకు అవగాహన కల్పించాలి
రోహిణి కార్తెలో వ‌రి నారు- సాగుపై అవ‌గాహ‌న స‌దస్సులో మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి‌
వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడంకోసం తెలంగాణ ప్ర‌భుత్వం కృషి చేస్తుంద‌ని, సీయం కేసీఆర్ పిలుపు మేర‌కు రైతులంతా రోహిణి కార్తెలోనే నాట్లు వేయాల‌ని అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, న్యాయ‌, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అన్నారు.
సోమ‌వారం దివ్యా గార్డెన్ లో నిర్వ‌హించిన రోహిణి కార్తెలో వ‌రి నారు- సాగుపై అవ‌గాహ‌న స‌దస్సులో మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి పాల్గొన్నారు. స‌కాలంలో పంట‌ల సాగు, ప్ర‌త్యామ్నాయ పంట‌లు, త‌దిత‌ర అంశాల‌పై అధికారులు, రైతుల‌కు మంత్రి దిశానిర్ధేశం చేశారు. రోహిణి కార్తెలో నాట్లు వేయించేందుకు రైతుల‌ను స‌మాయ‌త్తం చేయాల‌ని వ్య‌వ‌సాయ శాఖ అధికారుల‌కు సూచించారు. జిల్లా రైతాంగం సన్నరకాల వ‌రి సాగు చేసేలా అధికారులు అవగాహన కల్పించాలన్నారు. పంట సాగు విధానంలో మార్పులు రావ‌లని, రైతులు కూడా సంప్ర‌దాయ పంట‌ల‌ను కాకుండా మార్కెట్ డిమాండ్ ను బ‌ట్టి పంట సాగు చేయాల‌న్నారు. ప్ర‌త్య‌మ్నాయ పంట‌ల‌పై రైతులు దృష్టి సారించాల‌ని, వ్య‌వ‌సాయ అధికారుల సూచ‌న‌లు పాటించాల‌న్నారు.
రైతులు రోహిణి కార్తె లోగా నాట్లు పూర్తి చేస్తే పంట ముందే వస్తుందని.. ఫలితంగా వడగండ్ల కష్టాలు ఉండవన్నారు. ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉన్నాయని, ఇవి స‌కాలంలో రైతుల‌కు అందేలా చర్యలు చేపట్టాలని వ్యవసాయ అధికారులకు సూచించారు.రాష్ట్రంలో రైతన్నలు పండించే ప్రతీ ధాన్యం గింజనూ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు. చివ‌రి దాన్యం గింజ వ‌ర‌కు ప్ర‌భుత్వం కొనుగోలు చేస్తుంద‌ని అయ‌న భారోసా ఇచ్చారు.
ఈ కార్య‌క్ర‌మంలో ఖానాపైర్ ఎమ్మెల్యే రేఖా శ్యాంనాయ‌క్, క‌లెక్ట‌ర్ ముషార‌ఫ్ ఫారూఖీ, జ‌డ్పీ చైర్ ప‌ర్స‌న్ కే.విజ‌య‌ల‌క్ష్మి, రైతుబంధు స‌మితి జిల్లా క‌న్వీన‌ర్ న‌ల్లా వెంక‌ట్రామ్ రెడ్డి, మున్సిప‌ల్ చైర్మ‌న్ గండ్ర‌త్ ఈశ్వ‌ర్, జ‌డ్పీటీసీలు, రైతులు, ఇత‌ర ప్ర‌జాప్ర‌తినిదులు పాల్గొన్నారు.