కృష్ణా జిల్లాలో టిడిపికి షాకిస్తున్న జగన్

టిడిపికి పెట్టని కోట అయిన కృష్ణా జిల్లాలో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప యాత్రకు పెద్ద ఎత్తున స్పందన వస్తున్నది. ఇది అధికార తెలుగుదేశం పార్టీని ఇరుకున పెడుతున్నది.

నిన్న పెనమలూరు నియోజక వర్గ వుయ్యురు గ్రాంమం లో జగన్ రాక సందర్భంగా టీడీపీ వైస్సార్సీపీ మధ్య ఆధిపత్య పోరు జరిగింది. వై ఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసిన రహదారిలో పసుపు నీటి తో శుద్ధి చేయటానికి టీడీపీ నాయకులు ప్రయత్నించారు. విషయం తెలుసుకున్న వైస్సార్సీపీ నాయకులు పార్థసారథి అక్కడికి చేరుకుని టీడీపీ కార్యకర్తలను అడ్డుకున్నారు. ఇది వాగ్వాదానికి దారితీసింది.

కొద్ద సేపు ఉద్రిక వాతావరణ నెలకొంది. వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. చాలా సేపు నినాదాలు తోపులాట తర్వాత ఇరువర్గాల వారికి సర్ది చెప్పి పోలీసులు అందరిని అక్కడినుంచి పంపించేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *