ఆంధ్రలో తర్వలో మహిళలతో ప్రత్యేక పోలీస్ బెటాలియన్

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మహిళ లతో , గిరిజనులతో  ప్రత్యే పోలీస్ బెటాలియన్లు ఏర్పాటు చేయబోతున్నది.

ఈ విషయాన్ని రాష్ట్ర హోం, విపత్తుల నిర్వహణ శాఖల మంత్రి మేకతోటి సుచరిత చెప్పారు.

ఆదివారం ఉదయం సచివాలయం 2వ బ్లాక్ లో ఆ ఛాంబర్ లో  ఆమె పెదవీ బాధ్యతలు స్వీకరించారు. పోలీస్ కానిస్టేబుల్ మెడికల్ రీయింబర్స్ మెంట్ ఫైల్ పై మంత్రి తొలి సంతకం చేశారు.

అంతకు ముందు భర్త దయాసాగర్ తో కలసి సచివాలయానికి  వచ్చిన మంత్రికి వేద పండితులు వేద మంత్రాలు, మేళతాళాలతో స్వాగతం పలికారు. ఛేంబర్ లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తరువాత మంత్రి బాధ్యతలు స్వీకరించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర విభజన సందర్భంగా రాష్ట్రంలో నాలుగు బెటాలియన్లు ఏర్పాటు చేసే అవకాశం వచ్చిందని అయితే,   వాటిని ఇంతవరకు ఏర్పాటు చేయలేదు.  వాటిలో ఒకటి మహిళా బెటాలియన్అని  మరొకటి గిరిజన బెటాలియన్ . వీటిని తొందర్లోనే  చేస్తామని చెప్పారు.

దళిత మహిళనైన తనకు బాధ్యత గల హోమ్ మంత్రి పదవి ఇచ్చినందుకు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు.

రాష్ట్రంలో శాంతిభద్రతలు పరిరక్షించవలసిన గురుతర బాధ్యత పోలీస్ శాఖపై ఉందని చెబుతూ మహిళలమీద చిన్నారులపై జరిగే అత్యాచారాలు అరికట్టడానికి, అటువంటి సంఘటనలు జరుగకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటామని ఆమె చెప్పారు.

పోలీస్ వ్యవస్థలో మార్పులు తీసుకువచ్చి, పోలీసులు కూడా వారానికి ఒక రోజు తమ కుటుంబాలతో ఆనందంగా గడపడానికి వీక్లీ ఆఫ్ ని తప్పనిసరిగా అమలు చేయడానికి చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు.

2018 రిక్రూట్ మెంట్ కు సంబంధిచిన ఫలితాలు త్వరలో ప్రకటిస్తామని వెల్లడించారు.  పోలీస్ శాఖలోని ఇతర ఖాళీల భర్తీకి త్వరలో నోటిఫికేష్ విడుదల చేస్తామని చెప్పారు.

మహిళలు గానీ, ఇతర బాధితులు గానీ భయపడకుండా పోలీసులకు ఫిర్యాదు చేయడానికి టోల్ ఫ్రీ నెంబర్ ని ఏర్పాటు చేస్తామన్నారు.

తాను మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన వెంటనే ఒక బాధితురాలి తల్లి అనంతపురం నుంచి ఫోన్ చేసి నాలుగు నెలల క్రితం జరిగిన ఒక సంఘటనపై ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.

ఫాస్టర్ ఓ చిన్నారి పట్ల అసభ్యంగా ప్రవర్తించారని ఆమె చెప్పినట్లు తెలిపారు. వెంటనే తాను అధికారులకు విషయం తెలిపి విచారించి, తగిన చర్యలు తీసుకోమని చెప్పానన్నారు. పోలీసులు వెళ్లేసరికి ఫాసర్ట్ పారిపోయారని తెలిపారు.

‘‘వెంటనే చర్యలు తీసుకోలేకపోయారు. అసమర్థులు’’ అన్నట్లు కొందరు మీడియా వారు రాశారని చెప్పారు.

ఆ తరువాత రెండు రోజులకు ఆ ఫాస్టర్ ని అరెస్ట్ చేసి, రిమాండ్ కు పంపారని తెలిపారు. ఫిర్యాదు అందిన తరువాత చర్యలు తీసుకునే సమయం ఇవ్వకుండా ఆ విధంగా రాయడమేమిటని ఆమె ప్రశ్నించారు. తొందరపడకుండా ఫిర్యాదు అందిన తరువాత కొద్దిగా సమయం ఇవ్వాలని మంత్రి సుచరిత మీడియా వారిని కోరారు.