బిసి రిజర్వేన్ల కోసం టిజెఎస్ దీక్ష, కాంగ్రెస్ మద్దతు

బిసి రిజర్వేషన్ ల అమలు పట్ల టీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా   తెలంగాణా జన సమితి చేపట్టిన దీక్షకాంగ్రెస్ మద్దతు ప్రకటించింది.

తెలంగాణా సాధన కోసం దాదాపు 1500 వందల మంది బిడ్డలు ఆత్మబలిదానం చేసుకుంటే వారిలో ఎక్కువ మంది బీసిల బిడ్డలే అత్మహత్యలు చేసుకున్నారని  తెలంగాణా రాష్ట్ర సాకారం అయితే తమ హక్కులు సాధించుకోవచ్చని  ప్రాణాలను సైతం లెక్కచేయకుండా బరిగీసి కొట్లాడారన్నారని వారి ఆశయాలు వమ్ము అయ్యాయని పార్టీ అధికార ప్రతినిధి డాక్టర్ శ్రవణ్ దాసోజు ఈ సందర్భంగా మాట్లాడుతూ అన్నారు.

తెలంగాణా వస్తే సామాజిక న్యాయం వస్తుందని కొట్లాడి తెలంగాణా సాధించుకున్నామని,  కాని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు దుర్మార్గంగా ప్రవర్తిస్తూ బీసిల నోట్లో మన్నుగోట్టి నాలుగున్నరేళ్ల తర్వాత కూడా ఎక్కడేసిన గొంగళక్కడే అన్నట్లు మార్చారని  ఆయన ఆరోపించారు.

జనసమితి దీక్ష ఈ రోజు ఇందిరా పార్క్ వద్ద జరిగింది.

గతంలో ఇచ్చిన 34 శాతం రిజర్వేషన్లు ఇప్పుడెందుకు ఇవ్వలేక పోతున్నారో ప్రభుత్వం స్పష్టం చేయాలని దాసోజు డిమాండ్ చేశారు.

2010 లో కృష్ణమూర్తి వర్సెస్ భారత ప్రభుత్వం విషయంలో  సుప్రీంకోర్టులో తీర్పు ఇస్తే … ఆతర్వాత దేశవ్యప్తంగా జరిగిన ఎన్నికల్లో బీసిలకు 34 శాతం రిజర్వేషన్లు అమలయ్యాయని గుర్తుచేశారు. అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదశ్ లో కూడా రిజర్వేషన్లు అమలయ్యాయని కాని ఇక్క డెందుకు రిజర్వేషన్లు అమలు చేయలేకపోతున్నారో ముఖ్యమంత్రి స్పష్టం చేయాలన్నారు. ఆర్డినెన్స్ ద్వారా అనుకున్న పదవులు ఇచ్చుకుంటున్న కేసీఆర్ 52 శాతం ఉన్న బిసి భవిష్యత్తును నిర్ణయించే రిజర్వేషన్లు విషయంలో ఆర్డినెన్స్  ఎందుకు తీసుకువచ్చారని ప్రశ్నించారు.

బిసి ల పట్ల చిన్నచూపు చూస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్

బిసికులాలకు చెందిన వారిని బానిసల్లా బతకండని శాసించిండన్నారు. అణగదొక్కేందకు చేసే ప్రయత్నంలో భాగంగానే దొడ్డిదారిన ఎన్నికలకు పోతున్నాడన్నారు.  పంచాయితీరాజ్ చట్టం 2018 ప్రవేశ పెట్టినప్పుడు  సమగ్ర కుటుంబ సర్వే చేసినప్పుడు 52 శాతం ఉన్నరని తెలిసిన  మేమెంతో మాకంత రావాలని ఉద్యమంలో కూడా కొట్లాడామన్నారు.  ప్రాణాలకు తెగించి సాధించుకున్న తెలంగాణాలో సమగ్ర సర్వే ప్రకారం  52 శాతం కాకుండా ఎందుకు 33 శాతం రిజర్వేషన్లు ఇస్తున్నారని కోర్టులో కేసు వేసానని, విద్యా ఉపాధి రంగాల్లో ఏ,బీ,సి,డి, ఈ ,లుగా ఎలాగయితే రిజర్వేషన్లు అమలు అవుతున్నయో అదేవిధంగా రాజకీయాల్లో కూడా ఎందుకు అమలు చేయాలని కోరానన్నారు. కాని ముఖ్యమంత్రి తన స్ధాయి మరిచి వాడెవడో దాసోజు శ్రవణ్ అట ఏ,బీ,సి,డి,ఈ లు గా వర్గీకరించాలని కేసు వేశాడని వెటకారంగా మాట్లాడుతున్నాడని శ్రవణ్ ఆక్షేపించారు.

బీసి కులాలకు  న్యాయం జరుగాలని హైకోర్టులో కేసేస్తే జస్టిస్ ఎంఎస్ రామచంద్రరావు గారు  బిసి కులగణన చేయాలని చాలా స్పష్టంగా ఆదేశాలిచ్చారని బీసిల వెనుక బాటు తనం పై అధ్యయనం చేయాలని తీర్పు చెప్పారన్నారు. అవి రెండు చేసిన తర్వాత గ్రామాల వారిగా ఆ వివరాలన్ని కూడా గ్రామ సభలో పెట్టి ప్రచురించి అభ్యంతరాలు స్వీకరించాలని తద్వారా   ఎన్నికలకు పోవాలా అని ఎ,బీ,సి,డి,ఈ చేయాలని తీర్పు ఇస్తే తనకు తోచిన విథంగా వ్యవహరించారన్నారు.

జూన్,2018లో  కోర్టు తీర్పు వస్తే గడిచిన ఆరునెలలుగా కులగణన చేపట్టకుండా, కాలాయాపన చేశారన్నారు. ముఖ్యమంత్రి ఒక్కరోజులో సమగ్ర కుటుంబ సర్వే చేయగలిగారని కాని కేవలం 2 కోట్ల మంది బీసిల లెక్కలు తీయడానికి అభ్యంతరమేంటని ప్రశ్నించారు. హైకోర్టు స్పష్టమైన తీర్పు  ఇస్తే పక్కన బెట్టి… టీఆర్ఎస్ పార్టీ నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే అనుచరుడు గోపాల్ రెడ్డి అనే వ్యక్తి వేసిన కేసుల ఆధారంగా రిజర్వేషన్లు 50 శాతం దాటకూడదని కేసేయించారన్నారు. కేసులో మూడు, నాలుగు మార్లు హియిరింగు వచ్చినా  రాష్ట్రప్రభుత్వం నుంచి ఏఒక్కరూ హాజరుకాకుండా  బిసిల పట్ల బాధ్యత లేకుండా వ్యవహరించారని ఆరోపించారు. ప్రభుత్వం నుంచి స్పందన లేకనే కోర్టు50 శాతం రిజర్వేషన్లు దాటకూడదని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిందన్నారు. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ కు పోకుండా సుప్రీంకోర్టుకు పోయి కృష్ణమూర్తి జడ్జిమెంట్ ను అసరాగా చేసుకుని తీర్పునిచ్చిందన్నారు. బీసీల వెనకబాటు తనంను పై స్పష్టమైన సమాచారం వస్తే తదనుగుణంగా  రిజర్వేషన్లు కేటాయించుకోవచ్చన్న  విషయాన్ని పక్కదారి పట్టించారని ఆరోపించారు.  ఇదే విషయాన్ని నిమ్మక జయరాజ్ వర్సెస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేసులో స్పష్టం చేసిందని గుర్తుచేశారు.

పార్టీ జెండాలు ఎజెండాలు పక్కన పెట్టి బీసి రిజర్వేషన్లుకోసం సమైక్య పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. బీసిల హక్కుల సాధన కోసం పోరాటం చేయాలని లేదంటే బానిసకొక బానిస అన్నట్లు పరిస్థితి  మారుతుందన్నారు.

తెలంగాణా ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ప్రొఫెసర్ కోదండరాం ఆధ్వర్యంలో బీసీ రిజర్వేషన్లు సాధించుకునేందుకు బీసీలంతా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేత వినయ్ కుమార్,బీసి సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య, టీజెఎస్ నేతలు పీఎల్ విశ్వేశ్వర్, దిలీప్ కుమార్, గాదె ఇన్నయ్య, , జస్వంత్, ఝాన్పీ గారు, వార్డు సత్యం, బూస శ్రీనివాస్ గారు నర్సయ్యగారు రమేశ్  తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *