ఇక చాలు, వైసిపి ఆటలు సాగనిచ్చేది లేదు : చంద్రబాబు ఆగ్రహం

ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవటానికి పల్నాడు ని రక్షించుకోవటానికే 11న ఛలో ఆత్మకూరుకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుపిలుపు నిచ్చారు. ఈ రోజు ఆయన పార్టీ కార్యకర్తలతో టెలికాన్ఫరెన్ఫ్ లో మాట్లారు. తెలుగుదేశం కార్యకర్తల కుటుంబాల మీద జరుగుతున్న దాడులను ఆయన తీవ్రంగా ఖండించారు.దీనికి వ్యతిరేకంగా ఉద్యమించాలని ఆయన పిలుపు నిచ్చారు. చలో ఆత్మకూరు ఇందులో భాగమే. తెలుగుదేశం కార్యకర్తలంతా అంతా ధైర్యంగా ఉండాలని, వీళ్ళ ఆటలు సాగనిచ్చేది లేదని ఆయన  చెప్పారు.
తెలుగుదేశం ఒంటరి కాదు అని ఈ పర్యటన ద్వారా తెలుపుదామని ఆయన చెప్పారు. ఆయన ఇంకా ఏమన్నారంటే…
తెలుగుదేశం ఓ వ్యక్తి కాదు ఓ పెద్ద వ్యవస్థ అని ఛలో ఆత్మకూరు ద్వారా చాటుదాం
ఛలో పల్నాడుకు నాయకులంతా తరలి రావాలి
పోలీసులు పెట్టె ప్రతి అక్రమ కేసు కు సమాధానం చెప్పేలా చేద్దాం
మానవహక్కుల సంఘానికి తెలపడంతో పాటు ప్రయివేటు కేసులు నమోదు చేద్దాం
10వ తేదీన న్యాయవాదుల సమావేశం నిర్వహిస్తున్నాం
రాష్ట్ర వ్యాప్తంగా తెదేపా లీగల్ సెల్ కి సంబంధించిన న్యాయవాదులంతా దీనికి వస్తారు
లీగల్ సెల్ ను పటిష్ట పరుద్దాం
రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న దాడులకు, అక్రమ కేసులకు లీగల్ సెల్ అండగా ఉంటుంది
కార్యకర్తలు అంతా ధైర్యంగా ఉండాలి
వీళ్ళ ఆటలు సాగనిచ్చేది లేదు
ఇష్టానుసారం మనల్ని కొడతామంటే పడటానికి సిద్ధంగా లేము
ఎన్ని కేసులు పెడతారో పెట్టమనండి నేను చూస్తా
అందరి ముందు నెనుoటా…, ముందు నా మీద కేసు పెట్టమనండి చూద్దాం
బాబాయి ని ఎవరు చంపారో చెప్పలేని వ్యక్తి మనల్ని భయపెట్టాలని చూస్తే ఊరుకునేది లేదు
బాధితులకు బస్సులు పెట్టి ర్యాలీగా తీసుకెళదాం
10వ తేదీ రాత్రికి రాష్ట్ర వ్యాప్త బాధితులంతా పునరావాస కేంద్రానికి వస్తే అక్కడి నుంచి వారి వారి స్వస్థలాలకు వెళ్లేలా చేద్దాం
బెదిరించి, భయపెట్టి రాజకీయం చేయటం వీళ్ళ వల్ల కాదు