స్కూటర్ నడిపిన ఎమ్మెల్యే రోజా, ఎందుకంటే…

ఈ రోజు 31 వ జాతీయ రహదారి భద్రతా వారోత్సవాలలో భాగంగా పుత్తూరులో స్కూటర్ నడుపుతూ వైసిపి ఎమ్మెల్యే రోజా ట్రాఫిక్ సేఫ్టీనినాదాలు చేశారు. ప్రజలలో సురక్షితంగా టూవీలర్ ప్రయాణం కోసం అవగాహన కల్పించేందుకు ఈ  కార్యక్రమం ఏర్పాటు చేశారు. వేగం కన్నా ప్రాణం మిన్న, హెల్మెట్ ధరించాలని అంటూ వాహనదారుల్లో అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు.ద్విచక్ర వాహనాలు నడిపేటప్పుడు కచ్చితంగా హెల్మెట్ ధరించాలని విజ్ఞప్తి ఆమె విజ్ఞప్తి చేశారు.