ఆర్టీసి మీద హైకోర్టు కమిటీ వద్దన్న తెలంగాణ ప్రభుత్వం

ఆర్టీసీ సమ్మె వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసింది.

ముగ్గురు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తుల కమిటీ ప్రతిపాదనకు ప్రభుత్వం విముఖత చూపింది.

ఆర్టీసీ సమ్మె అంశం లేబర్‌ కోర్టులో ఉండడం వల్ల కమిటీ అవసరం లేదని కోర్టుకు ప్రభుత్వం తెలిపింది.

ఆర్టీసీ సమ్మెపై చట్ట ప్రకారం లేబర్‌ కమిషన్‌కు ఆదేశాలు ఇవ్వాలని అఫిడవిట్‌లో ప్రభుత్వం పేర్కొంది.