తెలంగాణలో రెవిన్యూ వాళ్ల ఘోరాలు, మరొక రైతు ఘోష

ఈ వీడియో రెవిన్యూ డిపార్ట్ మెంటు వాళ్లు చేసిన ఆగడాలను ఒక రైతు అబ్లుల్లా పూర్ మెట్ దుర్ఘటన తర్వాత ఇలా బయటపెడుతున్నాడు. ఈ రైతు ఆవేదన చూస్తే గుండె తరుక్కుపోతుంది. ఎమ్మార్వోదగ్గిర నుంచి ఆఫీసులో ఉన్న వాళ్లంతా  వేలకు వేలు డబ్బుతిన్నారు.పని చేయడం లేదు. ఈ రైతును ఆఫీసు చుట్టుతిప్పుకుంటూ బంగారు బాతులాగా వాడుకుంటున్నారు. విఆర్ ఎ నరసయ్య అందరి తరఫున వసులూ చేసి హింసిస్తున్నాడని ఆయన పేరు కూడా చెప్పాడు. వీళ్లని ఏం చేయాలి అని అడుగుతున్నాడు. చివరకు రికార్డులు విఆర్ ఎకు అనుకూలంగా రాసుకున్నాడు. ఎమ్మార్వో చూస్తాం,చూస్తాం అంటున్నాడు తప్ప ఏమీ చేయడంలేదు. రెండేళ్లుగా తిప్పుకుంటున్నారు.