సాయివర్ధన్ కథ విషాదం, బోరు బావి మింగేసింది…

తెలంగాణ మెదక్‌ జిల్లా పాపన్న పేట మండలం పొడ్చన్‌పల్లి సాయివర్ధన్ కథ విషాదాంతమైంది.  బుధవారం సాయంత్రం బోరుబావిలో పడిన సాయిని కాపాడలేకపోయారు. సాయి వయసు మూడేళ్లు.
 గురువారం ఉదయం 5.45 గంటల సమయంలో 25 అడుగుల లోతు నుంచి బాలుడి మృతదేహాన్ని ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు వెలికితీశాయి.ఈ వ్యవసాయ బోర్ బావి  లోతు 120 అడుగులు. బుధవారం సాయంకాలం తాత తో కలసి ఆదారిన వెళ్తున్నపుడు సాయి పొరపాటున బోర్ బావిలో పడిపోయాడు.

https://trendingtelugunews.com/english/features/coronavirus-test-rt-pcr-cost-will-haunt-people-post-lockdown/

ఆక్సిజన్‌ అందకపోవడం వల్లే బాలుడు మృతి చెందినట్లు ప్రాథమికంగా గుర్తించారు. బోరు బావిలో పడిన సాయి మీద బురద, మట్టి పడి దాదాపు పూడిపోయాడు. అందుకే పైనుంచి ఆక్సిజన్ పంపిన బాలుడికి అందలేదని తెలిసింది. సాయిని రక్షించేందుకు దాదాపు పది గంటలు ప్రయత్నించారు.బోర్ బావికిపక్కనే పెద్ద గోతిని తవ్వి కాపాడు ప్రయత్నం చేశారు. అయితే, అతన్ని చేరుకునే లోపే చనిపోయి ఉన్నాడని పోలీసులు తెలిపారు.

https://trendingtelugunews.com/english/features/pakka-inti-ammayi-padosan-relangi-hero-anjali-heroine/

అనంతరం మృతదేహాన్ని మెదక్‌ ఏరియా ఆస్పత్రికి తరలించారు.ఈ పొలంలో మొత్తంమూడు బావులుతవ్వారు. అన్ని ఫెయిలయ్యాయి.
ఎవరు బాధ్యలు?
మెదక్ జిల్లా పాపన్న పేట్ మండలం పోడ్చన్ పల్లి లో ఈ రోజే తీసిన బోర్ బావిలో మంగలి బిక్షపతి కి చెందిన పొలంలో అతని బిడ్డ కుమారుడు గోవర్ధన్ మూడవ కుమారుడు సాయివర్థన్ తల్లిదండ్రులతో నడుస్తూ బోరు బావిలో పడ్డాడు
విఫలమైన బోరు బావులు విఫలమైనప్పుడు వెంటనే వాటిని మూసివేయించాల్సిన బాధ్యత  రెవెన్యూ అధికారులది. బోర్ బావులకు అనుమతి ఇచ్చేటప్పుడు చూపిన శ్రద్ధ విఫలమైనప్పుడు వాటిని మూసి వేయడం  చూపకపోవడంతో ఈ ఘటన లు జరుగుతున్నాయిని బాలల హక్కుల సంఘం అధ్యక్షుడు అచ్యుత రావు అభిప్రాయపడ్డారు.
ఘటన జరగగానే పెద్ద ప్రహసనం చేసే యంత్రాంగానికి ముందు జాగ్రత్త లో లేదని చెబుతూ విఫలమైన బోరు బావులను మూసివేయడంలో నిర్లక్ష్యం చూపిన అధికారుల పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన  డిమాండ్ చేశారు.

One thought on “సాయివర్ధన్ కథ విషాదం, బోరు బావి మింగేసింది…

Comments are closed.