అనగనగా ఒక స్కూలు, దాని కష్టాలు చూడండి…

విజయవాడ నగర శివారు నిడమానురు నెహ్రు నగర్ లో ఆరు సంవత్సరాల నుండి నడుస్తున్న సి.బి.సి.ఎం.సి.ప్రైమరీ స్కూలుని ఖాళీ చేయించారు.

ఎందుకంటే, వార్డు సచివాలయానికి ఆఫీస్ కావాలట.

అధికారులే ఇలా చేయడం తో,చేసేది ఏమి లేక పక్కనే షామిన టెంట్ వేసుకొని ఆరుబయటే పాఠశాల ని నడుపుతున్నాడు ఉపాధ్యాయుడు.

స్కూల్ లో 45 మంది విద్యార్థులు వున్నారు. అయినా లెక్కచేయకుండా ప్రభుత్వ పాఠశాలని గ్రామా సచివాలయం కోసం ఖాళీ చేయించడమే ఆశ్చర్యం.

విద్యార్థులను రోడ్డు న పడేసిన వారి మీద చర్యలు తీసుకోవాలని గగ్గోలు పెడుతున్నారు విద్యార్థులు తల్లిదండ్రులు.