వైసిపిలో చేరిన అయ్యన్న పాత్రుడి సోదరుడు సన్యాసి పాత్రుడు

తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు,  మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు సోదరుడు సన్యాసి పాత్రుడు వైసిపిలో చేరారు. ఈ రోజు మధ్యాహ్నం ఆయన ముఖ్యమంత్రి  కార్యాలయంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. జగన్ ఆయనకు పార్టీ శాలువ కప్పి వైసిపిలోకి ఆహ్వానించారు.  సన్యాసి పాత్రుడుతో పాటు నర్సీపట్నం పార్టీ కార్యకర్తలు మరియు ముఖ్యనేతలు ఉన్నారు

అనంతరం ఆయన విలకరులతో మాట్లా డుతూ ఇలా చెప్పారు.

వైసీపీ లో చేరడం ఆనందంగా ఉంది, పార్టీ బలోపేతానికి నా వంతు కృషి చేస్తా. సీఎం జగన్ రెడ్డి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చూసి పార్టీలో చేరాము.నర్సీపట్నంలో పార్టీ అభివృద్ధికి నా వంతు సహకారం అందిస్తాను..

బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు నామినేటెడ్ పదవులు పనుల్లో 50 శాతం ఇవ్వడం సంతోషం.